తీహార్ జైలులో కవితకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
- July 16, 2024
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురి అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత మంగళవారం అనారోగ్యం పాలయ్యారు.
గమనించిన జైలు అధికారులు చికిత్స నిమిత్తం కవితను వెంటనే దీన్ దయాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
ఈ కేసులో బెయిల్ కోసం కవిత విశ్వ ప్రయత్నాలు చేసిన ఆమెకు నిరాశే ఎదురువుతోంది. ఈ క్రమంలో కవిత అస్వస్థతకు గురి కావడం గమనార్హం. కవిత అస్వస్థతకు గురి అయ్యారని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం