అర్థరాత్రి జూనియర్లపై విరుచుకుపడిన సీనియర్లు.. ఏకంగా ఇనుప బకెట్లు, పెట్టెలతో దాడి
- July 17, 2024
అర్థరాత్రి జూనియర్లపై సీనియర్లు దాడికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మంగళవారం పాఠశాలలో జూనియర్లు, సీనియర్ విద్యార్థులకు స్వల్ప వాగ్వాదం జరింగింది. ఈ క్రమంలో రెండు వర్గా మధ్య గొడవ తారాస్థాయికి చేరి కొట్టుకునేంత వరకు వెళ్లింది. అర్థరాత్రి దాటిన తరువాత ఉన్నట్టుండి జూనిర్లందరిని సీనియర్లు ఓ గదిలో బంధించారు. అనంతరం చేతికి దొరికిన ఇనుప పెట్టెలు, బకెట్లతో వారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అందులో రాకేష్ అనే విద్యార్థికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకొమ్మని పంపితే ఇలా ప్రాణాలు పోయేలా కొట్టుకోవడం ఏంటని సినీయర్లను ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సినియర్ విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







