అర్థరాత్రి జూనియర్లపై విరుచుకుపడిన సీనియర్లు.. ఏకంగా ఇనుప బకెట్లు, పెట్టెలతో దాడి
- July 17, 2024
అర్థరాత్రి జూనియర్లపై సీనియర్లు దాడికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మంగళవారం పాఠశాలలో జూనియర్లు, సీనియర్ విద్యార్థులకు స్వల్ప వాగ్వాదం జరింగింది. ఈ క్రమంలో రెండు వర్గా మధ్య గొడవ తారాస్థాయికి చేరి కొట్టుకునేంత వరకు వెళ్లింది. అర్థరాత్రి దాటిన తరువాత ఉన్నట్టుండి జూనిర్లందరిని సీనియర్లు ఓ గదిలో బంధించారు. అనంతరం చేతికి దొరికిన ఇనుప పెట్టెలు, బకెట్లతో వారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అందులో రాకేష్ అనే విద్యార్థికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకొమ్మని పంపితే ఇలా ప్రాణాలు పోయేలా కొట్టుకోవడం ఏంటని సినీయర్లను ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సినియర్ విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







