అర్థరాత్రి జూనియర్లపై విరుచుకుపడిన సీనియర్లు.. ఏకంగా ఇనుప బకెట్లు, పెట్టెలతో దాడి
- July 17, 2024
అర్థరాత్రి జూనియర్లపై సీనియర్లు దాడికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మంగళవారం పాఠశాలలో జూనియర్లు, సీనియర్ విద్యార్థులకు స్వల్ప వాగ్వాదం జరింగింది. ఈ క్రమంలో రెండు వర్గా మధ్య గొడవ తారాస్థాయికి చేరి కొట్టుకునేంత వరకు వెళ్లింది. అర్థరాత్రి దాటిన తరువాత ఉన్నట్టుండి జూనిర్లందరిని సీనియర్లు ఓ గదిలో బంధించారు. అనంతరం చేతికి దొరికిన ఇనుప పెట్టెలు, బకెట్లతో వారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అందులో రాకేష్ అనే విద్యార్థికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకొమ్మని పంపితే ఇలా ప్రాణాలు పోయేలా కొట్టుకోవడం ఏంటని సినీయర్లను ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సినియర్ విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







