అర్థరాత్రి జూనియర్లపై విరుచుకుపడిన సీనియర్లు.. ఏకంగా ఇనుప బకెట్లు, పెట్టెలతో దాడి
- July 17, 2024
అర్థరాత్రి జూనియర్లపై సీనియర్లు దాడికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ పరిధిలోని బాలుర గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మంగళవారం పాఠశాలలో జూనియర్లు, సీనియర్ విద్యార్థులకు స్వల్ప వాగ్వాదం జరింగింది. ఈ క్రమంలో రెండు వర్గా మధ్య గొడవ తారాస్థాయికి చేరి కొట్టుకునేంత వరకు వెళ్లింది. అర్థరాత్రి దాటిన తరువాత ఉన్నట్టుండి జూనిర్లందరిని సీనియర్లు ఓ గదిలో బంధించారు. అనంతరం చేతికి దొరికిన ఇనుప పెట్టెలు, బకెట్లతో వారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అందులో రాకేష్ అనే విద్యార్థికి తీవ్రంగా రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకొమ్మని పంపితే ఇలా ప్రాణాలు పోయేలా కొట్టుకోవడం ఏంటని సినీయర్లను ప్రశ్నించారు. ఈ ఘటనపై విచారణ జరిపి సినియర్ విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









