అమృత్‌ కాలానికి చెందిన బడ్జెట్‌ ఇది : ప్రధాని మోడీ

- July 22, 2024 , by Maagulf
అమృత్‌ కాలానికి చెందిన బడ్జెట్‌ ఇది : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం  మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు బిల్లులను సభామోదం కోసం తీసుకురానుంది. మరో వైపు నీట్‌ ప్రశ్నపత్నం లీకేజీ, రైల్వే భద్రత, కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్ష ఇండియా కూటమి సభ్యులు సిద్ధమయ్యారు.

కాగా, బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోడి పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం పూర్తి చేస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం దేశం కోసం పోరాడుతోందని చెప్పారు. ఐదేళ్లు ప్రగతి కోసం పోరాడాలని, తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచించాలని కూటమి నేతలకు మోడీ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com