రాత్రివేళ ఔట్ డోర్ పనిపై కన్స్ట్రక్షన్ వర్కర్ల ఆసక్తి
- June 14, 2016
మధ్యాహ్న సమయంలోనే కాకుండా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడిమి తీవ్రంగా ఉండటంతో సూర్యాస్తమయం తర్వాత పనిచేయడానికే ఔట్ డోర్లో పనిచేసే నిర్మాణ రంగ కార్మికులు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మిడ్ డే బ్రేక్ ఉన్నప్పటికీ, ఈ మూడున్నర గంటల్లో వేడిమిని తప్పించుకున్నా, అంతకు ముందు ఆ తర్వాత వేడి తమకు ఇబ్బందికరంగానే ఉందని వారు తెలిపారు. ఉదయం వేళల్లో కన్నా సూర్యాస్తమయం తర్వాత చేసే పని పట్ల ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారనీ, ఆ సమయంలో పని కూడా వేగంగా జరుగుతోందని, కొన్ని సంస్థలు ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు ఝాము 4 గంటల వరకు పని దినాల్ని చేపట్టి విజయం సాధించాయని కన్స్ట్రక్షన్ రంగానికి చెందిన సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఒకరు చెప్పారు. చాలా వరకు కార్మికులు రాత్రి వేళ పనిచేయడానికి నిరాకరించడంలేదు. షెల్టర్ నీడన పనిచేయాల్సి వచ్చినా వేడి ప్రభావంతో పని సామర్థ్యం తగ్గుతోందని నిపుణులు వివరిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







