ఆసియా కప్: నేపాల్ పై భారత్ ఘన విజయం...
- July 23, 2024
శ్రీలంక: ఆసియా కప్లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో నేపాల్ జట్టును చిత్తుగా ఓడించి ఆఫీషియల్గా సెమీస్కు గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్స్ కు చేరింది. కాగా, ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 178 పరుగులు బాదింది. అనంతరం భారీ టార్గెట్తో చేజింగ్ ప్రారంభించిన నేపాల్ జట్టును 100 పరుగుల లోపుకే పరిమితం చేసింది.
ముందుగా బ్యాట్తో దంచికొట్టిన భారత్.. బంతితోనూ చెలరేగడంతో…. 179 పరుగుల భారీ ఛేదనలో నేపాల్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత మహిళల జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేపాల్ బ్యాటర్లలో సీతా రాణా మగర్ (18), బిందు రావల్ (17 నాటౌట్) హైస్కోరర్లుగా నిలిచారు.
ఇక, అంతకముంద బ్యాటింగ్ చేసిన షెఫాలీ వర్మ (81; 48 బంతుల్లో, 12 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసం సృష్టించింది. హేమలత (47; 42 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







