అస్సాంలోని సోనాపూర్లో ఘోర బస్సు ప్రమాదం..
- June 15, 2016
మేఘాలయ రాష్ట్ర సరిహద్దు, అస్సాంలోని సోనాపూర్లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మంగళవారం రాత్రి సిల్చార్ నుంచి గౌహతికి వెళ్తున్న బస్సు మేఘాలయలోని ఈస్ట్ జైంటియా పర్వత ప్రాంతంలో సోనాపూర్ మందిర్ సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. బస్సులో సుమారు 35మంది ఉన్నట్లు సమాచారం.సమాచారం అందుకున్న పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లు ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.బుధవారం ఉదయం ఐదుగురు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బస్సు పడిన లోయ సుమారు 500 అడుగుల లోతు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!







