శ్రీదేవి ప్రధాన పాత్రలో 'మామ్‌'

- June 15, 2016 , by Maagulf
శ్రీదేవి ప్రధాన పాత్రలో  'మామ్‌'

 శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'మామ్‌'. ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఇటీవల యూఎస్‌ వెళ్లిన శ్రీదేవి అక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందట. 'మామ్‌' కోసం యూనిట్‌ సభ్యులు జార్జియాలోని చల్లటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని, మైనస్‌ 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్‌ జరిపినట్లు సమాచారం. బోనీకపూర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తొలి భాగానికి సంబంధించిన షూటింగ్‌ ఇండియాలో జరిగింది. ఈ చిత్రంలో శ్రీదేవితో పాటు పాకిస్థానీ నటుడు అద్నాన్‌ సిద్ధిఖీ, అక్షయ్‌ ఖన్నా, అభిమన్యు సింగ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
విజయ్‌ హీరోగా నటించిన 'పులి' చిత్రంలో శ్రీదేవి ఇటీవల వెండితెరపై కనిపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com