ఇక పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం: కేసీఆర్
- July 25, 2024
హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి చేసిన బడ్జెట్ ప్రసంగం ఓ కథలా, రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం రైతులను వంచించిందని, బడ్జెట్లో ఒక్క పాలసీ ప్రకటించలేదని, ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదని విమర్శించారు. ఏ ఒక్క దానిపైనా క్లారిటీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకూ ఇచ్చిందేమి లేదని, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదన్నారు. ఇక ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని హెచ్చరించారు. గ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ విధానపరంగా లేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలని అనుకున్నామని, కానీ ఆ ప్రభుత్వానికి అసలు పాలసీనే లేదని బడ్జెట్ చూశాక అర్థమైందని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో దళితబంధు ప్రస్తావనే లేదని, ప్రభుత్వం దళితుల గొంతు కోసిందని ఆరోపించారు. బడ్జెట్లో భట్టి వట్టి మాటలు చెప్పారన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









