మేజర్ డ్రగ్ ట్రాఫికింగ్ రింగ్ బస్ట్.. ముగ్గురు అరెస్ట్
- July 26, 2024
మనామా: ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా రింగ్కు సంబంధించిన కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. నిందితులు 30 నుంచి 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. నిందితులపై చట్టబద్ధమైన అనుమతి లేకుండా గంజాయిని దిగుమతి చేసుకోవడం, కలిగి ఉండటం, విక్రయించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. విచారణ సందర్భంగా డ్రగ్స్ వాడుతున్నట్లు నిందితులు అంగీకరించారు. కానీ తాము విక్రయాలు చేయడం లేదని వారు పేర్కొన్నారు. వీరిని కింగ్ ఫహద్ కాజ్వే వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారివద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ విభాగంలోని టాక్సికాలజీ అండ్ డ్రగ్స్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









