మేజర్ డ్రగ్ ట్రాఫికింగ్ రింగ్ బస్ట్.. ముగ్గురు అరెస్ట్
- July 26, 2024
మనామా: ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా రింగ్కు సంబంధించిన కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. నిందితులు 30 నుంచి 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. నిందితులపై చట్టబద్ధమైన అనుమతి లేకుండా గంజాయిని దిగుమతి చేసుకోవడం, కలిగి ఉండటం, విక్రయించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. విచారణ సందర్భంగా డ్రగ్స్ వాడుతున్నట్లు నిందితులు అంగీకరించారు. కానీ తాము విక్రయాలు చేయడం లేదని వారు పేర్కొన్నారు. వీరిని కింగ్ ఫహద్ కాజ్వే వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారివద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ విభాగంలోని టాక్సికాలజీ అండ్ డ్రగ్స్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







