మేజర్ డ్రగ్ ట్రాఫికింగ్ రింగ్ బస్ట్.. ముగ్గురు అరెస్ట్
- July 26, 2024
మనామా: ఇద్దరు సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా రింగ్కు సంబంధించిన కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ ప్రారంభించింది. నిందితులు 30 నుంచి 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం.. నిందితులపై చట్టబద్ధమైన అనుమతి లేకుండా గంజాయిని దిగుమతి చేసుకోవడం, కలిగి ఉండటం, విక్రయించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. విచారణ సందర్భంగా డ్రగ్స్ వాడుతున్నట్లు నిందితులు అంగీకరించారు. కానీ తాము విక్రయాలు చేయడం లేదని వారు పేర్కొన్నారు. వీరిని కింగ్ ఫహద్ కాజ్వే వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారివద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ విభాగంలోని టాక్సికాలజీ అండ్ డ్రగ్స్ లేబొరేటరీ నివేదిక ప్రకారం.. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులలో గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







