సిరియాలో ఘర్షణలు..

- June 15, 2016 , by Maagulf
సిరియాలో ఘర్షణలు..

సిరియాలోని అలెప్పో ప్రావిన్స్‌లో ప్రభుత్వ అనుకూల వర్గాలు, ఉగ్రవాదులు, రెబల్స్‌కు మధ్య జరిగిన ఘర్షణల్లో 24 గంటల్లో దాదాపు 70 మంది మరణించారు. సిరియా ప్రభుత్వ అనుకూల పోరాటం చేసేవారు రష్యా వైమానిక దాడుల సహాయంతో ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న జేతాన్‌, ఖాలసా గ్రామాలను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినట్ల సిరియాలో మానవహక్కుల పరిశీలన సంస్థ వెల్లడించింది.
దీంతో సిరియాలో అల్‌ఖైదాకు చెందిన అల్‌-నుస్రా ఫ్రంట్‌ అనే ఉగ్రవాద గ్రూపు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులు చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో చాలా మంది చనిపోయారు. జిహాదిస్ట్‌లు, రెబల్స్‌ దక్షిణ అలెప్పోలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రాంతాల్లో గత రాత్రి భారీగా వైమానిక దాడులు జరిగినట్లు సిరియా అబ్జర్వేటరీ వెల్లడించింది. అల్‌-నుస్రా ఫ్రంట్‌ ఉగ్రవాదులు లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com