ఖర్జూర బర్ఫీ
- June 15, 2016
కావలసినవి: ఖర్జూరపళ్లు అర కేజి, చక్కెర 150 గ్రా., పచ్చి కోవా 200 గ్రా., పాలు ఒక కప్పు, డ్రింకింగ్ చాకొలేట్ పౌడర్ ఒక టేబుల్ స్పూను, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా తరిగిన జీడిపపలు, బాదం పప్పులు కొద్దిగా.
ఎలా చేయాలి
ఖర్జూర పళ్లలో గింజలు తీసివేసి రెండు గంటల పాటు పాలలో నానబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నెయ్యిని వేడి చేసి ఖర్జూర మిశ్రమం, చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగాక పచ్చి కోవా, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేయాలి. ఈ మిశ్రమమంతా దగ్గర పడేవరకు ఆపకుండా కలుపుతూ ఉండాలి. చివర్లో చాకొలేట్ పౌడర్ వేసి బాగా కలిపి కిందికి దించాలి. నెయ్యి పూసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా సర్దాలి. చల్లారాక ఇష్టమైన విధంగా ముక్కలు కోసుకోవాలి.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









