కువైట్ బయోమెట్రిక్.. 28.5% మంది ప్రవాసులు దూరం
- August 01, 2024
కువైట్: బయోమెట్రిక్ వేలిముద్రలను ప్రారంభించినప్పటి నుండి దాదాపు 2.5 మిలియన్ల మంది పౌరులు, నివాసితులు పూర్తి చేశారని క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఈద్ అల్-ఒవైహాన్ తెలిపారు. 2,487,932 మంది బయోమెట్రిక్ వేలిముద్రను పూర్తి చేసినట్టు వెల్లడించారు. సుమారు 22% మంది కువైటీలు ఇంకా బయోమెట్రిక్ తీసుకోలేదని, 28.5% మంది ప్రవాసులు ఇంకా బయోమెట్రిక్ స్కాన్ చేయించుకోలేదన్నారు. పౌరులు మరియు నివాసితులు తమ బయోమెట్రిక్ స్కాన్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు, ప్రాజెక్ట్ విజయవంతానికి దారితీసినందుకు అల్-అవైహాన్ ప్రశంసించారు.
కువైట్లకు సెప్టెంబర్ 30 వరకు, ప్రవాసులకు డిసెంబర్ 30 వరకు గడువు పొడిగించినందున, పౌరులు మరియు నివాసితులు బయోమెట్రిక్ పూర్తి చేయడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ తగిన సమయాన్ని ఇస్తోంది. ఈ తేదీ తర్వాత బయోమెట్రిక్ వేలిముద్ర వేయని ప్రతి పౌరుడు లేదా నివాసి లావాదేవీలు నిలిపివేయబడతాయని అల్-అవైహాన్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









