కువైట్ బయోమెట్రిక్.. 28.5% మంది ప్రవాసులు దూరం

- August 01, 2024 , by Maagulf
కువైట్ బయోమెట్రిక్.. 28.5% మంది ప్రవాసులు దూరం

కువైట్: బయోమెట్రిక్ వేలిముద్రలను ప్రారంభించినప్పటి నుండి దాదాపు 2.5 మిలియన్ల మంది పౌరులు, నివాసితులు పూర్తి చేశారని క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఈద్ అల్-ఒవైహాన్ తెలిపారు. 2,487,932 మంది బయోమెట్రిక్ వేలిముద్రను పూర్తి చేసినట్టు వెల్లడించారు. సుమారు 22% మంది కువైటీలు ఇంకా బయోమెట్రిక్ తీసుకోలేదని, 28.5% మంది ప్రవాసులు ఇంకా బయోమెట్రిక్ స్కాన్ చేయించుకోలేదన్నారు. పౌరులు మరియు నివాసితులు తమ బయోమెట్రిక్ స్కాన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు, ప్రాజెక్ట్ విజయవంతానికి దారితీసినందుకు అల్-అవైహాన్ ప్రశంసించారు.

కువైట్‌లకు సెప్టెంబర్ 30 వరకు,  ప్రవాసులకు డిసెంబర్ 30 వరకు గడువు పొడిగించినందున, పౌరులు మరియు నివాసితులు బయోమెట్రిక్ పూర్తి చేయడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ తగిన సమయాన్ని ఇస్తోంది. ఈ తేదీ తర్వాత బయోమెట్రిక్ వేలిముద్ర వేయని ప్రతి పౌరుడు లేదా నివాసి లావాదేవీలు నిలిపివేయబడతాయని అల్-అవైహాన్ హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com