నిహారిక నిర్మాతగానైనా రాణిస్తుందా.?
- August 07, 2024
మెగా డాటర్ నిహారిక వెండితెరపై వెలిగిపోవాలనుకుంది కానీ, ఎందుకో ఏమో ఆ కోరిక తీరడం లేదు నిహారికకు. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. అయినా ప్రయత్నిస్తూనే వుందనుకోండి.
ఆ ప్రయత్నాలు అలా వుండగానే.. నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకోవాలనుకుంది. ఇంతవరకూ షార్ట్ ఫిలింస్కి మాత్రమే నిర్మాతగా వ్యవహరించిన నిహారిక తొలిసారి ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది.
అదే ‘కమిటీ కుర్రోళ్లు’. అచ్చమైన గోదావరి పల్టెటూరి వాతావరణంలో జరిగే కథతో తెరకెక్కిన చిత్రమిది. ఓ ఊరిలోని 11 మంది కుర్రాళ్ల కథే ఈ ‘కమిటీ కుర్రోళ్లు’. ప్రచార చిత్రాలు బాగున్నాయ్.
వినోదంతో పాటూ, అందరికి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఎమోషన్ అలాగే యాక్షన్ ఇలా అన్ని రకాలూ పుష్కలంగా కలగలిపిన కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘మా అన్నయ్యకి ఆస్కార్ దక్కింది. మా పెదనాన్నకి పద్మ విభూషణ్ వచ్చింది. మా బాబాయ్కి డిప్యూటీ సీఎం పదవి వచ్చింది.. నాకు కూడా ఈ సినిమాతో నిర్మాతగా ఓ సూపర్ హిట్ ఇచ్చేయండ్రా బాబూ..’ అంటూ నిహారిక ప్రమోషన్లు ఊదరగొడుతోంది.
11 మంది హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్లలో నటుడు ఆది కూడా తనదైన పంచ్ డైలాగులతో ఆసక్తి క్రియేట్ చేస్తున్నాడు. సినిమాని బాగానే ప్రమోట్ చేశారు. రిజల్ట్ ఎలాంటిది దక్కుతుందో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!







