నిహారిక నిర్మాతగానైనా రాణిస్తుందా.?
- August 07, 2024
మెగా డాటర్ నిహారిక వెండితెరపై వెలిగిపోవాలనుకుంది కానీ, ఎందుకో ఏమో ఆ కోరిక తీరడం లేదు నిహారికకు. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది. అయినా ప్రయత్నిస్తూనే వుందనుకోండి.
ఆ ప్రయత్నాలు అలా వుండగానే.. నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటుకోవాలనుకుంది. ఇంతవరకూ షార్ట్ ఫిలింస్కి మాత్రమే నిర్మాతగా వ్యవహరించిన నిహారిక తొలిసారి ఓ సినిమాకి నిర్మాతగా వ్యవహరించింది.
అదే ‘కమిటీ కుర్రోళ్లు’. అచ్చమైన గోదావరి పల్టెటూరి వాతావరణంలో జరిగే కథతో తెరకెక్కిన చిత్రమిది. ఓ ఊరిలోని 11 మంది కుర్రాళ్ల కథే ఈ ‘కమిటీ కుర్రోళ్లు’. ప్రచార చిత్రాలు బాగున్నాయ్.
వినోదంతో పాటూ, అందరికి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఎమోషన్ అలాగే యాక్షన్ ఇలా అన్ని రకాలూ పుష్కలంగా కలగలిపిన కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘మా అన్నయ్యకి ఆస్కార్ దక్కింది. మా పెదనాన్నకి పద్మ విభూషణ్ వచ్చింది. మా బాబాయ్కి డిప్యూటీ సీఎం పదవి వచ్చింది.. నాకు కూడా ఈ సినిమాతో నిర్మాతగా ఓ సూపర్ హిట్ ఇచ్చేయండ్రా బాబూ..’ అంటూ నిహారిక ప్రమోషన్లు ఊదరగొడుతోంది.
11 మంది హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్లలో నటుడు ఆది కూడా తనదైన పంచ్ డైలాగులతో ఆసక్తి క్రియేట్ చేస్తున్నాడు. సినిమాని బాగానే ప్రమోట్ చేశారు. రిజల్ట్ ఎలాంటిది దక్కుతుందో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు









