ఎన్టీయార్-ప్రశాంత్ నీల్ ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా.!
- August 07, 2024
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ఎన్టీయార్ చేయాల్సిన సినిమాకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 9న ఈ సినిమా పట్టాలెక్కనుందన్నదే ఆ ఆప్డేట్ సారాంశం.
మైత్రీ మూవీస్ బ్యానర్తో కలిసి ఎన్టీయార్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకి టైటిల్ కూడా ఫలానా అంటూ ప్రచారం జరుగుతోంది.
గత కొన్నాళ్లుగా ఈ సినిమా స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దాదాపు స్క్రిప్టు ఫైనల్ అయిపోయింది. ఆగస్టులోనే సినిమా పట్టాలెక్కిస్తామని గతంలోనే చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఆగస్టు 9న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ సారి మాత్రం పక్కా అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీయార్ ‘దేవర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్లో ‘వార్ 2’ లోనూ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు.
ఇక, ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్ట్నీ పట్టాలెక్కించేస్తే.. ఎన్టీయార్ ఫ్యాన్స్కి అంతకన్నా కావాల్సిందేముంది.! పండగే పండగ.
తాజా వార్తలు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!









