ఎన్టీయార్-ప్రశాంత్ నీల్ ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా.!
- August 07, 2024
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ఎన్టీయార్ చేయాల్సిన సినిమాకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 9న ఈ సినిమా పట్టాలెక్కనుందన్నదే ఆ ఆప్డేట్ సారాంశం.
మైత్రీ మూవీస్ బ్యానర్తో కలిసి ఎన్టీయార్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకి టైటిల్ కూడా ఫలానా అంటూ ప్రచారం జరుగుతోంది.
గత కొన్నాళ్లుగా ఈ సినిమా స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దాదాపు స్క్రిప్టు ఫైనల్ అయిపోయింది. ఆగస్టులోనే సినిమా పట్టాలెక్కిస్తామని గతంలోనే చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఆగస్టు 9న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ సారి మాత్రం పక్కా అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీయార్ ‘దేవర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్లో ‘వార్ 2’ లోనూ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు.
ఇక, ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్ట్నీ పట్టాలెక్కించేస్తే.. ఎన్టీయార్ ఫ్యాన్స్కి అంతకన్నా కావాల్సిందేముంది.! పండగే పండగ.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









