ఎన్టీయార్-ప్రశాంత్ నీల్ ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా.!
- August 07, 2024
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ఎన్టీయార్ చేయాల్సిన సినిమాకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 9న ఈ సినిమా పట్టాలెక్కనుందన్నదే ఆ ఆప్డేట్ సారాంశం.
మైత్రీ మూవీస్ బ్యానర్తో కలిసి ఎన్టీయార్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకి టైటిల్ కూడా ఫలానా అంటూ ప్రచారం జరుగుతోంది.
గత కొన్నాళ్లుగా ఈ సినిమా స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. దాదాపు స్క్రిప్టు ఫైనల్ అయిపోయింది. ఆగస్టులోనే సినిమా పట్టాలెక్కిస్తామని గతంలోనే చెప్పారు. అందుకు తగ్గట్లుగానే ఆగస్టు 9న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ సారి మాత్రం పక్కా అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీయార్ ‘దేవర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్లో ‘వార్ 2’ లోనూ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు.
ఇక, ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్ట్నీ పట్టాలెక్కించేస్తే.. ఎన్టీయార్ ఫ్యాన్స్కి అంతకన్నా కావాల్సిందేముంది.! పండగే పండగ.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్







