అమెజాన్, గూగుల్ ప్రతినిధులతో నేడు రేవంత్ భేటి

- August 09, 2024 , by Maagulf
అమెజాన్, గూగుల్ ప్రతినిధులతో నేడు రేవంత్ భేటి

అమెరికా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి.. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు.

రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి రాయితీలు ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు అమెరికా పర్యటనలో ఉన్నారు.

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ గూగుల్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆ తర్వాత సీఎం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని బయో డిజైన్ సెంటర్‌కి వెళతారు. యూనివర్సిటీలోని సస్టైనబిలిటీ డీన్ అరుణ్ మజుందార్, ప్రొఫెసర్ రాజ్ దత్‌తో వివిధ అంశాలపై చర్చిస్తారు. .అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో రేవంత్ సమావేశం కానున్నారు.

గూగుల్ ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెజాన్ గ్లోబల్ డేటా సెంటర్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్‌తో సమావేశం కానుంది. ఆ తర్వాత Z స్కాలర్ జై చౌదరిని, కంపెనీ వ్యవస్థాపకుడుని కలుస్తారు. ఎనోవిక్స్, ఫిషర్ సైంటిఫిక్, మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులతో కూడా. సమావేశం కాను lన్నారు. ప్రొఫెసర్ సాల్మన్ స్మార్ట్ విలేజ్ మూమెంట్స్‌లో డార్విన్‌ను కలుసుకున్నాడు. అనంతరం ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com