నేటి నుంచి ‘హర్ ఘర్ తిరంగా’
- August 09, 2024
న్యూ ఢిల్లీ: ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు యావత్తు భారతావని సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని జాతీయ పండగగా నిర్వహించాలని జులైలో మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు పాల్గొని జాతీయ పతాకంతో సెల్ఫీ దిగి ఆ చిత్రాన్ని https://harghartiranga.com/వెబ్సైట్లో పోస్ట్ చేయాలని సూచించారు.
‘హర్ఘర్తిరంగా’ను గుర్తుండిపోయే ఈవెంట్గా మార్చుకుందామని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా అందరూ త్రివర్ణ పతాకాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ పెట్టారు.
‘ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో హర్ఘర్తిరంగాని మరపురాని ప్రజా ఉద్యమంగా మారుద్దాం. నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేసి ఈ ఉద్యమంలో నాతో చేరాలని మీ అందరినీ కోరుతున్నాను. జాతీయ జెండాలతో ఉన్న మీ సెల్ఫీలను https://harghartiranga.com/లో షేర్ చేయండి’ అంటూ మోదీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- తెలంగాణ: ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు
- ఈద్ అల్ ఫితర్..యూఏఈలో వర్షం పడుతుందా?
- 32 ఉల్లంఘనలను జారీ చేసిన కువైట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- అత్యవసర సంఘటన ప్రాంతాలకు దూరంగా ఉండండి..!!
- ఖతార్ లో 6నెలలకు సరిపోయేలా నిత్యావసరాల నిల్వలు..!!
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..









