రన్ ఓవర్ ప్రమాదం.. వాహనదారుడు, పాదచారులకు జరిమానా

- August 12, 2024 , by Maagulf
రన్ ఓవర్ ప్రమాదం.. వాహనదారుడు, పాదచారులకు జరిమానా

దుబాయ్: డ్రైవర్లు మరియు పాదచారులు ఇద్దరికీ నిబంధనలు, జరిమానాలు వర్తిస్తాయని.. ట్రాఫిక్ చట్టాల గురించి తెలుసుకోవాలని దుబాయ్ నివాసితులకు న్యాయ నిపుణుడు పిలుపునిచ్చారు. రన్ ఓవర్ ప్రమాదం తర్వాత దుబాయ్ కోర్టు ఒక వాహనదారుడికి మరియు పాదచారికి జరిమానా విధించింది.  ఇతరుల భద్రతకు హాని కలిగించినందుకు వాహనదారుడికి 3,000 దిర్హామ్‌లు,  నిర్దేశించని ప్రాంతం నుండి రోడ్డు దాటినందుకు పాదచారులకు 200 దిర్హామ్‌లు జరిమానా విధించినట్లు న్యాయ నిపుణుడు అబ్దుల్‌రహ్మాన్ అల్ కస్సెమ్ వెల్లడించారు.    

యూఏఈలో పాదచారులు రోడ్లు దాటడానికి జీబ్రా క్రాసింగ్‌లు, వంతెనలు లేదా సబ్‌వేలను ఉపయోగించాల్సి ఉంటుంది. అలా చేయడంలో విఫలమైతే 400 దిర్హామ్‌ల జరిమానా చెల్లించాలి.  దుబాయ్ లో గత ఏడాది రన్ ఓవర్ ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. 339 మంది గాయపడ్డారు. 2023లో జైవాకింగ్ చేసినందుకు దాదాపు 44,000 మంది పాదచారులకు జరిమానా విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com