వాహనదారులకు అలెర్ట్..అష్ఘల్ ఒనైజా స్ట్రీట్ మూసివేత..!
- August 13, 2024
దోహ: వాడి అల్ సెయిల్ ప్రాంతంలోని ఒనైజా స్ట్రీట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ప్రభావిత ప్రాంతం సైబర్ సెక్యూరిటీ సెంటర్ మరియు ఇంటీరియర్ మినిస్ట్రీ భవనం సమీపంలో ఉందని పేర్కొంది. తాత్కాలిక మూసివేత దోహాకు వెళ్లే ఒక లేన్పై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 19 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటానని తెలిపారు. నిర్వహణ మరియు పేవ్మెంట్ పనుల అమలు కోసం రహదారిని మూసివేస్తున్నట్లు అష్ఘల్ ప్రకటించింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!