ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం..

- August 17, 2024 , by Maagulf
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం..

న్యూ ఢిల్లీ: ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం కోసం నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రధానిని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధానితో చర్చించారు చంద్రబాబు.

వైసీపీ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని మోదీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు విడుదల చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీతో తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com