ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు సమావేశం..
- August 17, 2024
న్యూ ఢిల్లీ: ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అమరావతి పునర్ నిర్మాణం, పోలవరం కోసం నిధులు కేటాయించాలని చంద్రబాబు ప్రధానిని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై ప్రధానితో చర్చించారు చంద్రబాబు.
వైసీపీ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని మోదీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు విడుదల చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీతో తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









