ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- August 17, 2024
హైదరాబాద్: కలకత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు . ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అధినేత , చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ " ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయింది.యావత్ భారతావని దిగ్భాంతికి లోనయింది . ఈ సంఘటన అందరిని కలిచివేసింది అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి " అన్నారు
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ " నేడు దేశమంతా ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నది. ఈ సంఘటన అత్యంత భాదాకరమైనది . ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము అందరం బాధితురాలికి మద్దతునిస్తూ మా ఓపీ సేవలను బహిష్కారాయించామన్నారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ హరి కృష్ణ మాట్లాడుతూ " ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కు ఇలా జరగడం దారుణాతిదారుణం . ఈ ఘటన నన్నెంతో భాదకు గురిచేసింది , భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండావుండే విధంగా ఈ దారుణకి ఒడిగట్టిన వారిని శిక్షించాలి , ఆ బంగారుతల్లి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు "
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









