ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- August 17, 2024
హైదరాబాద్: కలకత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు . ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అధినేత , చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ " ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయింది.యావత్ భారతావని దిగ్భాంతికి లోనయింది . ఈ సంఘటన అందరిని కలిచివేసింది అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి " అన్నారు
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ " నేడు దేశమంతా ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నది. ఈ సంఘటన అత్యంత భాదాకరమైనది . ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము అందరం బాధితురాలికి మద్దతునిస్తూ మా ఓపీ సేవలను బహిష్కారాయించామన్నారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ హరి కృష్ణ మాట్లాడుతూ " ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్ కు ఇలా జరగడం దారుణాతిదారుణం . ఈ ఘటన నన్నెంతో భాదకు గురిచేసింది , భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండావుండే విధంగా ఈ దారుణకి ఒడిగట్టిన వారిని శిక్షించాలి , ఆ బంగారుతల్లి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు "
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్