జైశంకర్తో కువైట్ విదేశాంగ మంత్రి భేటీ
- August 19, 2024
కవైట్: కువైట్లో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్-యాహ్యా ఆదివారం డాక్టర్ ఎస్ జైశంకర్తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో డిప్యూటీ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబా కూడా పాల్గొన్నారు.రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. వివిధ సహకార రంగాలపై ఇరువురు చర్చించారు.ఈ ప్రాంతంలో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు, ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే ఫ్రేమ్వర్క్లు మరియు ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను సమీకరించడం గురించి కూడా సమావేశంలో చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి అల్-యాహ్యా భారత ప్రతినిధి బృందానికి గౌరవార్థం లంచ్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







