పూరీకి తప్పని కష్టాలు.! ‘డబుల్’ ఇస్మార్ట్ నష్టాలు.!
- August 21, 2024
పూరీ జగన్నాధ్ని కష్టాలు వెంటాడుతూనే వున్నాయ్. సొంత నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేస్తున్నాయ్. ‘లైగర్’ దెబ్బ నుంచి ఇప్పటికే కోలుకోలేదు.
ఎలాగైనా ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టి ‘లైగర్’ నష్టాల్ని పూడ్చుకోవాలని ఆశ పడిన పూరీకి మళ్లీ నిరాశే మిగిలింది. ఈ సినిమాకి ఫస్ట్ డే టాకే తేలిపోయింది. దాంతో, ఎవ్వరూ ఈ సినిమాని దేకలేదు.
కలిసొచ్చిన సెలవులు ఒకింత ఊరటనిచ్చినప్పటికీ 52 కోట్ల బ్రేక్ ఈవెన్ ఎక్స్పెక్ట్ చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’, కేవలం 12 కోట్లకే పరిమితమవ్వడం దారుణమైన దెబ్బను మిగిల్చింది.
దాంతో, మళ్లీ పూరీ జగన్నాధ్ నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది. ‘లైగర్’ నష్టాలతోనే దారుణమైన అవమానాలకు గురయ్యాడు పూరీ జగన్నాధ్. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తోచినంత నష్టాల్ని భర్తీ చేసే కార్యక్రమం చేపట్టాడు.
అదే ఇంకా పూర్తి కాలేదంటే, ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ యవ్వారం ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









