పూరీకి తప్పని కష్టాలు.! ‘డబుల్’ ఇస్మార్ట్ నష్టాలు.!
- August 21, 2024
పూరీ జగన్నాధ్ని కష్టాలు వెంటాడుతూనే వున్నాయ్. సొంత నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేస్తున్నాయ్. ‘లైగర్’ దెబ్బ నుంచి ఇప్పటికే కోలుకోలేదు.
ఎలాగైనా ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టి ‘లైగర్’ నష్టాల్ని పూడ్చుకోవాలని ఆశ పడిన పూరీకి మళ్లీ నిరాశే మిగిలింది. ఈ సినిమాకి ఫస్ట్ డే టాకే తేలిపోయింది. దాంతో, ఎవ్వరూ ఈ సినిమాని దేకలేదు.
కలిసొచ్చిన సెలవులు ఒకింత ఊరటనిచ్చినప్పటికీ 52 కోట్ల బ్రేక్ ఈవెన్ ఎక్స్పెక్ట్ చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’, కేవలం 12 కోట్లకే పరిమితమవ్వడం దారుణమైన దెబ్బను మిగిల్చింది.
దాంతో, మళ్లీ పూరీ జగన్నాధ్ నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది. ‘లైగర్’ నష్టాలతోనే దారుణమైన అవమానాలకు గురయ్యాడు పూరీ జగన్నాధ్. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తోచినంత నష్టాల్ని భర్తీ చేసే కార్యక్రమం చేపట్టాడు.
అదే ఇంకా పూర్తి కాలేదంటే, ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ యవ్వారం ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







