పూరీకి తప్పని కష్టాలు.! ‘డబుల్’ ఇస్మార్ట్ నష్టాలు.!
- August 21, 2024
పూరీ జగన్నాధ్ని కష్టాలు వెంటాడుతూనే వున్నాయ్. సొంత నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేస్తున్నాయ్. ‘లైగర్’ దెబ్బ నుంచి ఇప్పటికే కోలుకోలేదు.
ఎలాగైనా ‘ఇస్మార్ట్ శంకర్’తో హిట్టు కొట్టి ‘లైగర్’ నష్టాల్ని పూడ్చుకోవాలని ఆశ పడిన పూరీకి మళ్లీ నిరాశే మిగిలింది. ఈ సినిమాకి ఫస్ట్ డే టాకే తేలిపోయింది. దాంతో, ఎవ్వరూ ఈ సినిమాని దేకలేదు.
కలిసొచ్చిన సెలవులు ఒకింత ఊరటనిచ్చినప్పటికీ 52 కోట్ల బ్రేక్ ఈవెన్ ఎక్స్పెక్ట్ చేసిన ‘డబుల్ ఇస్మార్ట్’, కేవలం 12 కోట్లకే పరిమితమవ్వడం దారుణమైన దెబ్బను మిగిల్చింది.
దాంతో, మళ్లీ పూరీ జగన్నాధ్ నష్టాల్ని చవి చూడాల్సి వచ్చింది. ‘లైగర్’ నష్టాలతోనే దారుణమైన అవమానాలకు గురయ్యాడు పూరీ జగన్నాధ్. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తోచినంత నష్టాల్ని భర్తీ చేసే కార్యక్రమం చేపట్టాడు.
అదే ఇంకా పూర్తి కాలేదంటే, ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ యవ్వారం ఎంత దూరం వెళుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









