అక్టోబరు 1 నుంచి భారతీయులకు ఫ్రీ వీసా..శ్రీలంక
- August 24, 2024
కువైట్: ‘పెర్ల్ ఆఫ్ ది హిందూ ఓషన్' యాత్రకు ప్లాన్ చేసుకుంటున్న భారతీయులకు శుభవార్త. శ్రీలంక ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి భారతదేశం, యూకే, యూఎస్ సహా 35 దేశాల పౌరులకు వీసా-రహిత యాక్సెస్ని ప్రకటించింది. ఈ వీసా-రహిత ప్రవేశం ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. IVS-GBS మరియు VFS గ్లోబల్ నిర్వహిస్తున్న ఈ-వీసా పోర్టల్ను సస్పెండ్ చేస్తూ ఆగస్టు 2న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారతీయులకు ఉచిత వీసా పొడిగింపు మే 31న ముగిసినందున, వారు ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వీసా ఆన్ అరైవల్ను ఎంచుకోవచ్చు. ఇ-వీసా సేవ ఇప్పుడు నిలిపివేయబడినందున, భారతీయులు అక్టోబర్ 1 వరకు వీసా-ఆన్-అరైవల్ ఎంపికను ఎంచుకోవచ్చు. భారతీయులకు ప్రస్తుత వీసా రుసుము $50 లేదా దాదాపు రూ.4,197 గా ఉంది.
తాజా వార్తలు
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!







