అక్టోబరు 1 నుంచి భారతీయులకు ఫ్రీ వీసా..శ్రీలంక
- August 24, 2024
కువైట్: ‘పెర్ల్ ఆఫ్ ది హిందూ ఓషన్' యాత్రకు ప్లాన్ చేసుకుంటున్న భారతీయులకు శుభవార్త. శ్రీలంక ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి భారతదేశం, యూకే, యూఎస్ సహా 35 దేశాల పౌరులకు వీసా-రహిత యాక్సెస్ని ప్రకటించింది. ఈ వీసా-రహిత ప్రవేశం ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. IVS-GBS మరియు VFS గ్లోబల్ నిర్వహిస్తున్న ఈ-వీసా పోర్టల్ను సస్పెండ్ చేస్తూ ఆగస్టు 2న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారతీయులకు ఉచిత వీసా పొడిగింపు మే 31న ముగిసినందున, వారు ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వీసా ఆన్ అరైవల్ను ఎంచుకోవచ్చు. ఇ-వీసా సేవ ఇప్పుడు నిలిపివేయబడినందున, భారతీయులు అక్టోబర్ 1 వరకు వీసా-ఆన్-అరైవల్ ఎంపికను ఎంచుకోవచ్చు. భారతీయులకు ప్రస్తుత వీసా రుసుము $50 లేదా దాదాపు రూ.4,197 గా ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







