అక్టోబరు 1 నుంచి భారతీయులకు ఫ్రీ వీసా..శ్రీలంక
- August 24, 2024
కువైట్: ‘పెర్ల్ ఆఫ్ ది హిందూ ఓషన్' యాత్రకు ప్లాన్ చేసుకుంటున్న భారతీయులకు శుభవార్త. శ్రీలంక ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి భారతదేశం, యూకే, యూఎస్ సహా 35 దేశాల పౌరులకు వీసా-రహిత యాక్సెస్ని ప్రకటించింది. ఈ వీసా-రహిత ప్రవేశం ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. IVS-GBS మరియు VFS గ్లోబల్ నిర్వహిస్తున్న ఈ-వీసా పోర్టల్ను సస్పెండ్ చేస్తూ ఆగస్టు 2న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారతీయులకు ఉచిత వీసా పొడిగింపు మే 31న ముగిసినందున, వారు ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వీసా ఆన్ అరైవల్ను ఎంచుకోవచ్చు. ఇ-వీసా సేవ ఇప్పుడు నిలిపివేయబడినందున, భారతీయులు అక్టోబర్ 1 వరకు వీసా-ఆన్-అరైవల్ ఎంపికను ఎంచుకోవచ్చు. భారతీయులకు ప్రస్తుత వీసా రుసుము $50 లేదా దాదాపు రూ.4,197 గా ఉంది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







