అక్టోబరు 1 నుంచి భారతీయులకు ఫ్రీ వీసా..శ్రీలంక
- August 24, 2024
కువైట్: ‘పెర్ల్ ఆఫ్ ది హిందూ ఓషన్' యాత్రకు ప్లాన్ చేసుకుంటున్న భారతీయులకు శుభవార్త. శ్రీలంక ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి భారతదేశం, యూకే, యూఎస్ సహా 35 దేశాల పౌరులకు వీసా-రహిత యాక్సెస్ని ప్రకటించింది. ఈ వీసా-రహిత ప్రవేశం ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. IVS-GBS మరియు VFS గ్లోబల్ నిర్వహిస్తున్న ఈ-వీసా పోర్టల్ను సస్పెండ్ చేస్తూ ఆగస్టు 2న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారతీయులకు ఉచిత వీసా పొడిగింపు మే 31న ముగిసినందున, వారు ఈ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా వీసా ఆన్ అరైవల్ను ఎంచుకోవచ్చు. ఇ-వీసా సేవ ఇప్పుడు నిలిపివేయబడినందున, భారతీయులు అక్టోబర్ 1 వరకు వీసా-ఆన్-అరైవల్ ఎంపికను ఎంచుకోవచ్చు. భారతీయులకు ప్రస్తుత వీసా రుసుము $50 లేదా దాదాపు రూ.4,197 గా ఉంది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









