యూఏఈలోని నివాసితుల్లో తీవ్ర ఆందోళన..!
- August 25, 2024
యూఏఈ: బంగ్లాదేశ్ నివాసితులు తమ కుటుంబాల గురించి ఆందోళన చెందుతున్నారు. తమ సొంతుర్లలో సంభవించిన వరదల కారణంగా కమ్యూనికేషన్ తెగిపోయింది. దాంతో తమ వారి గురించి బంగ్లా నివాసితులు ఆందోళన చెందుతున్నారు. కాగా, బంగ్లాలో తలెత్తిన వరదల్లో దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజలు చిక్కుకుపోయారు. కనీసం 13 మంది ప్రాణాలను కోల్పోయారు.
షార్జాలో నివసిస్తున్న 29 ఏళ్ల అక్రమ్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు తెలిపారు. "గత మూడు రోజులుగా, నేను ఇంటికి తిరిగి వచ్చిన నా కుటుంబ సభ్యులను సంప్రదించలేకపోయాను." అని అక్రం చెప్పాడు. దీరా నివాసి అష్రాఫుల్ ముబారక్.. వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఫెని పట్టణంలోని తన కుటుంబం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ సమయంలో వారికి అండగా నిల్వలేకపోతున్నట్లు తెలిపారు. ఆగస్టు 23 వారిని సంప్రదించడానికి ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేవని వాపోయాడు. బంగ్లాదేశ్లో విపత్తులో లక్షలాది మంది చిక్కుకుపోయారు. వారి ఇళ్లు మరియు జీవితాలు వరదతో అస్తవ్యస్తంగా మారాయి. యూఏఈలోని బంగ్లాదేశ్ ప్రవాసులకు, వారి ప్రియమైన వారితో కనెక్ట్ కాలేకపోవడం వినాశకరమైన ప్రకృతి విపత్తును పీడకలగా మార్చింది.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









