యూఏఈలోని నివాసితుల్లో తీవ్ర ఆందోళన..!
- August 25, 2024
యూఏఈ: బంగ్లాదేశ్ నివాసితులు తమ కుటుంబాల గురించి ఆందోళన చెందుతున్నారు. తమ సొంతుర్లలో సంభవించిన వరదల కారణంగా కమ్యూనికేషన్ తెగిపోయింది. దాంతో తమ వారి గురించి బంగ్లా నివాసితులు ఆందోళన చెందుతున్నారు. కాగా, బంగ్లాలో తలెత్తిన వరదల్లో దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజలు చిక్కుకుపోయారు. కనీసం 13 మంది ప్రాణాలను కోల్పోయారు.
షార్జాలో నివసిస్తున్న 29 ఏళ్ల అక్రమ్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు తెలిపారు. "గత మూడు రోజులుగా, నేను ఇంటికి తిరిగి వచ్చిన నా కుటుంబ సభ్యులను సంప్రదించలేకపోయాను." అని అక్రం చెప్పాడు. దీరా నివాసి అష్రాఫుల్ ముబారక్.. వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఫెని పట్టణంలోని తన కుటుంబం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ సమయంలో వారికి అండగా నిల్వలేకపోతున్నట్లు తెలిపారు. ఆగస్టు 23 వారిని సంప్రదించడానికి ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో లేవని వాపోయాడు. బంగ్లాదేశ్లో విపత్తులో లక్షలాది మంది చిక్కుకుపోయారు. వారి ఇళ్లు మరియు జీవితాలు వరదతో అస్తవ్యస్తంగా మారాయి. యూఏఈలోని బంగ్లాదేశ్ ప్రవాసులకు, వారి ప్రియమైన వారితో కనెక్ట్ కాలేకపోవడం వినాశకరమైన ప్రకృతి విపత్తును పీడకలగా మార్చింది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







