50℃ మార్కును దాటిన ఉష్ణోగ్రతలు.. వేసవి కాలం ముగిసిందా?

- August 28, 2024 , by Maagulf
50℃ మార్కును దాటిన ఉష్ణోగ్రతలు.. వేసవి కాలం ముగిసిందా?

యూఏఈ: సుయిహాన్ (అల్ ఐన్)లో ఉష్ణోగ్రతలు   50.7°C దాటిందని జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.అంతకుముందు జూలైలో రెండుసార్లు ఉష్ణోగ్రతలు 50°C మార్కును దాటింది. ఆగస్టు 24న సుహైల్ నక్షత్రం కనిపించడంతో వేసవి కాలం అధికారికంగా ముగిసింది. అయితే, ఉష్ణోగ్రతలు వెంటనే తగ్గవని, అయితే రాత్రి సమయంలో క్రమంగా తగ్గుదల కనిపిస్తుందని నిపుణులు తెలిపారు.

అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూఏఈ ప్రభుత్వం జూన్ 15 నుండి సెప్టెంబరు 15 వరకు మధ్యాహ్న విరామం ప్రకటించింది.మధ్యాహ్న విరామాన్ని పాటించని కంపెనీలకు ఒక్కో ఉద్యోగికి Dh5,000 జరిమానా విధించింది.అదే విధంగా యూఏఈ అధికారులు కార్మికులకు తరచుగా ఆహారం, నీరు మరియు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com