హైవేపై వాహనం బోల్తా.. విద్యార్థి మృతి, 11 మందికి గాయాలు
- August 28, 2024
దుబాయ్: దుబాయ్ హైవేపై వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. కారు ఇనుప అడ్డుగోడను ఢీకొని హట్టా-లహబాబ్ రోడ్డు పక్కన ఉన్న ఇసుక ప్రాంతంలో బోల్తా పడింది. ప్రమాదం సమయంలో వాహనంలో 12 మంది విద్యార్థులున్నారు. "ప్రాథమిక విచారణలో అతివేగం, అజాగ్రత్త మరియు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఒక విద్యార్థి మరణించాడు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు." మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. దుబాయ్ పోలీస్ తాత్కాలిక కమాండర్-ఇన్-చీఫ్, మేజర్-జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి.. తమ పిల్లలను సురక్షితంగా పాఠశాలలకు మరియు తిరిగి వచ్చేలా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









