బెంగాల్ పరువుతీయడమే బీజేపీ లక్ష్యం: సీఎం మమతా బెనర్జీ
- August 28, 2024
కోల్ కతా: పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బెంగాల్ రాజకీయాల్లోనూ ప్రకంపనలకు దారి తీసింది.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని నబన్నా అభియాన్ ర్యాలీ జరిగింది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషద్ (విద్యార్థి విభాగం) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బహిరంగ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్ పరువు తీయడమే బీజేపీ బంద్ లక్ష్యమని అన్నారు. వైద్యురాలి హత్యాచారం కేసును తప్పుదారి పట్టించేందుకు కుట్రచేస్తున్నారని ఆరోపించారు. బంద్ కు తాము మద్దతివ్వడం లేదన్నారు. రేప్ కేసుల్లో ఉరిశిక్షే సరైందన్నారు. వచ్చేవారం సమావేశాలు ఏర్పాటు చేసి రేపిస్టులకు కఠిన శిక్ష పడేలా అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తామన్నారు. గవర్నర్ దానిని ఆమోదించకుంటే రాజ్భవన్ ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!