కొరియా, ఇండియా దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాలు..ఖతార్

- August 28, 2024 , by Maagulf
కొరియా, ఇండియా దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాలు..ఖతార్

దోహా: రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండియా నుండి దిగుమతి చేసుకొనే కొన్ని రకాల ఆటోమోటివ్ బ్యాటరీల దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ  ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి (MOCI) షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్-థానీ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఉత్పత్తుల పోటీతత్వానికి మద్దతు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.  

కొరియా నుండి 35 నుండి 115 ఆంపియర్‌ల వరకు కెపాసిటీ కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజ్ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ డ్యూటీలను విధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇండియా  ఎగుమతి చేయబడిన 32 నుండి 225 ఆంపియర్‌ల వరకు సామర్థ్యం కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజీ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ 2024 నంబర్ 22న మంత్రి నిర్ణయాన్ని జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com