కొరియా, ఇండియా దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాలు..ఖతార్
- August 28, 2024
దోహా: రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండియా నుండి దిగుమతి చేసుకొనే కొన్ని రకాల ఆటోమోటివ్ బ్యాటరీల దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి (MOCI) షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్-థానీ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఉత్పత్తుల పోటీతత్వానికి మద్దతు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కొరియా నుండి 35 నుండి 115 ఆంపియర్ల వరకు కెపాసిటీ కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజ్ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ డ్యూటీలను విధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇండియా ఎగుమతి చేయబడిన 32 నుండి 225 ఆంపియర్ల వరకు సామర్థ్యం కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజీ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ 2024 నంబర్ 22న మంత్రి నిర్ణయాన్ని జారీ చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









