కొరియా, ఇండియా దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాలు..ఖతార్
- August 28, 2024
దోహా: రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండియా నుండి దిగుమతి చేసుకొనే కొన్ని రకాల ఆటోమోటివ్ బ్యాటరీల దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి (MOCI) షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్-థానీ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఉత్పత్తుల పోటీతత్వానికి మద్దతు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కొరియా నుండి 35 నుండి 115 ఆంపియర్ల వరకు కెపాసిటీ కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజ్ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ డ్యూటీలను విధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇండియా ఎగుమతి చేయబడిన 32 నుండి 225 ఆంపియర్ల వరకు సామర్థ్యం కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజీ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ 2024 నంబర్ 22న మంత్రి నిర్ణయాన్ని జారీ చేశారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







