ఎపి, తెలంగాణాలలో మరిన్ని ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్లు
- August 28, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా 234 నగరాల్లో కొత్తగా ఎఫ్.ఎమ్ రేడియో సౌకర్యం కల్పించనుంది. అందులో భాగంగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మరిన్ని ఎఫ్.ఎమ్ రేడియో కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ముఖ్యమైన నగరాల్లో ఎఫ్. ఎమ్ రేడియో సౌకర్యం ఉండగా.. తాజాగా మరిన్ని నగరాలలో ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు విస్తరించనున్నాయి. అందులో ఏపీలో 22 పట్టణాల్లో, తెలంగాణలో 10 పట్టణాల్లో ఎఫ్. ఎమ్ రేడియో సౌకర్యం కల్పించనుంది.
ఎపిలో కొత్తగా 68
ఏపీలో 68 ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. అందులో.. కాకినాడలో 4 స్టేషన్లు, కర్నూల్లో 4 స్టేషన్లు, ఆదోనిలో 3, అనంతపురం 3, భీమవరం 3, చిలకలూరిపేట 3, చీరాల 3, చిత్తూరు 3, కడప 3, ధర్మవరం 3, ఏలూరు 3, గుంతకల్ 3, హిందూపూర్ 3, మచిలీపట్నం 3, మదనపల్లె 3, నంద్యాల 3, నరసరావుపేట 3, ఒంగోలు 3, ప్రొద్దుటూరు 3, శ్రీకాకుళం 3, తాడిపత్రి 3, విజయనగరం 3.. ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.
తెలంగాణలో 31…
తెలంగాణలో కూడా 31 ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు కానున్నాయి. అందులో.. ఆదిలాబాద్ 3, కరీంనగర్ 3, ఖమ్మం 3, కొత్తగూడెం 3, మహబూబ్ నగర్ 3, మంచిర్యాల 3, నల్గొండ 3, నిజామాబాద్ 4, రామగుండం 3, సూర్యాపేటలో 3.. ఎఫ్.ఎమ్ రేడియో స్టేషన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







