బి.ఆర్.ఎస్ న్యాయం, ధర్మం గెలుస్తుంది: ఎమ్మెల్సీ కవిత
- August 28, 2024
హైదరాబాద్: ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని బి.ఆర్.ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ బంజరాహిల్స్లోని తన నివాసానికి చేరుకున్న కవితకు పార్టీశ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానన్న కవిత.. నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటాననన్నారు. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామమన్నారు.
ఇంటికి చేరుకున్న కవితకు నివాసంలో తల్లి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమతో పాటు ఇతర కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం సోదరుడు కేటీఆర్కు కవిత రాఖీ కట్టారు. అలాగే, కుటుంబీకులను ఆలింగనం చేసుకొని.. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించారు. రేపు ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్కు చేరుకొని కేసీఆర్తో భేటీ అవుతారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







