హమద్ పోర్ట్ లో 17 కిలోల గంజాయి సీజ్

- August 30, 2024 , by Maagulf
హమద్ పోర్ట్ లో 17 కిలోల గంజాయి సీజ్

దోహా: ఖతార్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐ), ఖతార్ కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఇందులో స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నారు. ఎంఓఐ విభాగానికి చెందిన పోలీసు డాగ్ విభాగం మత్తుపదార్థాలను దాచిన ప్రాంతాలను గుర్తించాయి. అనంతరం హమద్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.  నగలు, హస్తకళలు ఉన్నట్లు లేబుల్ చేసిన పార్శిళ్లలో గంజాయిని దాచి తరలించే యత్నం చేశారు. ఎక్స్-రే పరికరాలను ఉపయోగించి చెక్క వస్తువుల లోపల మత్తుపదార్థాలు దాగి ఉంచారు. స్వాధీనం చేసుకున్న పదార్థం మొత్తం బరువు సుమారు 17 కిలోగ్రాములు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com