గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన.. పోలీసుల కీలక ప్రకటన..
- August 30, 2024
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటన వివాదం సద్దుమణిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ సిబ్బంది సమక్షంలోనే గర్ల్స్ హాస్టల్ మొత్తం తనిఖీ చేశారు పోలీసులు. ఎలక్ట్రానిక్ డివైస్ ను గుర్తించే పరికరాలతో వాష్ రూమ్స్ తో పాటు హాస్టల్ లో అణువణువూ గాలించారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది సమక్షంలోనే దాదాపు 4 గంటలకు పైగా పోలీసుల తనిఖీలు సాగాయి. ఎక్కడా హిడెన్ కెమెరా లభించలేదని పోలీసులు తెలిపారు.
తమ సమక్షంలోనే జరిగిన తనిఖీల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థినులు ఆందోళనను విరమించారు. కాగా, సోమవారం వరకు కాలేజీకి సెలవులు ప్రకటించి మరోమారు తనిఖీలు చేపడతామని యాజమాన్యం ప్రకటించింది. అటు.. ఆందోళన చేసిన విద్యార్థినులపై ఎలాంటి చర్యలు, కక్ష సాధింపు ఉండరాదని కాలేజీ యాజమాన్యానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఆందోళన చేసిన విద్యార్థినుల పట్ల వేధింపులు ఉంటే ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ప్రభుత్వ చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి హాస్టల్ లో ఉండేందుకు అంగీకరించారు విద్యార్థినులు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..