కార్ల ఓడోమీటర్ ట్యాంపరింగ్.. ఇద్దరు అరెస్ట్
- September 01, 2024
కువైట్: అల్-రాయ్ ప్రాంతంలోని కార్ రిపేర్ వర్క్షాప్లో వాహన మైలేజీ మీటర్లను ట్యాంపరింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. గ్యారేజీలో ఉపయోగించిన వాహనాల మీటర్లను మారుస్తున్నట్లు సమాచారం అందగానే సాంకేతిక తనిఖీ విభాగం తనిఖీలు చేపట్టిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడంతోపాటు ట్యాంపరింగ్ కోసం ఉపయోగించిన అన్ని పరికరాలను సీజ్ చేసినట్టు తెలిపారు. వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు అప్పగించి, వర్క్ షాప్ ను సీజ్ చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









