కార్ల ఓడోమీటర్ ట్యాంపరింగ్.. ఇద్దరు అరెస్ట్
- September 01, 2024
కువైట్: అల్-రాయ్ ప్రాంతంలోని కార్ రిపేర్ వర్క్షాప్లో వాహన మైలేజీ మీటర్లను ట్యాంపరింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. గ్యారేజీలో ఉపయోగించిన వాహనాల మీటర్లను మారుస్తున్నట్లు సమాచారం అందగానే సాంకేతిక తనిఖీ విభాగం తనిఖీలు చేపట్టిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడంతోపాటు ట్యాంపరింగ్ కోసం ఉపయోగించిన అన్ని పరికరాలను సీజ్ చేసినట్టు తెలిపారు. వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు అప్పగించి, వర్క్ షాప్ ను సీజ్ చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







