వీసా క్షమాభిక్ష: అబుదాబిలో ఆరోగ్య బీమా జరిమానాలు మాఫీ..
- September 01, 2024
యూఏఈ: తమ స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న ఎంట్రీ, రెసిడెన్స్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరోగ్య బీమా జరిమానాలు మినహాయించబడతాయని అబుదాబి ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు నెలల యూఏఈ వీసా క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబర్ 1న ప్రారంభం అయింది. యూఏఈలో అక్రమంగా ఉంటున్న వారు తమ రెసిడెన్సీ స్థితిని క్రమబద్ధీకరించవచ్చు. జరిమానాలను చెల్లించకుండా దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) గతంలో ఎలాంటి ఓవర్స్టే జరిమానా లేదా ఎగ్జిట్ రుసుము వసూలు చేయడం లేదని ప్రకటించింది. దేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడే వారికి మళ్లీ ప్రవేశ నిషేధం ఉండదు. వారు సరైన వీసాతో ఎప్పుడైనా యూఏఈకి తిరిగి రావచ్చని ప్రకటించారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







