వీసా క్షమాభిక్ష: అబుదాబిలో ఆరోగ్య బీమా జరిమానాలు మాఫీ..
- September 01, 2024
యూఏఈ: తమ స్టేటస్ను క్రమబద్ధీకరించుకోవడానికి దరఖాస్తు చేసుకున్న ఎంట్రీ, రెసిడెన్స్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆరోగ్య బీమా జరిమానాలు మినహాయించబడతాయని అబుదాబి ఆరోగ్య శాఖ ప్రకటించింది. రెండు నెలల యూఏఈ వీసా క్షమాభిక్ష కార్యక్రమం సెప్టెంబర్ 1న ప్రారంభం అయింది. యూఏఈలో అక్రమంగా ఉంటున్న వారు తమ రెసిడెన్సీ స్థితిని క్రమబద్ధీకరించవచ్చు. జరిమానాలను చెల్లించకుండా దేశం విడిచి వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) గతంలో ఎలాంటి ఓవర్స్టే జరిమానా లేదా ఎగ్జిట్ రుసుము వసూలు చేయడం లేదని ప్రకటించింది. దేశం విడిచి వెళ్లడానికి ఇష్టపడే వారికి మళ్లీ ప్రవేశ నిషేధం ఉండదు. వారు సరైన వీసాతో ఎప్పుడైనా యూఏఈకి తిరిగి రావచ్చని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









