టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చిన ఎతిహాద్ విమానం..!
- September 03, 2024
యూఏఈ: అబుదాబి బయలుదేరిన ఎతిహాద్ విమానం పక్షులను ఢీకొట్టిన అనంతరం కొలంబోకు తిరిగి వచ్చింది. సెప్టెంబర్ 3న కొలంబో బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం (CMB) నుండి అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH)కి వెళ్లాల్సిన EY395 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చిందని అధికారులు తెలిపారు. జరిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. పక్షులను ఢీకొట్టడం ప్రమాదకరమని, తనిఖీల తర్వాత తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తామని విమానయాన సంస్థ తెలిపింది.తనిఖీల అనంతరం ఎతిహాద్ విమానం కొలంబో నుండి బయలుదేరిందని వెల్లడించారు. 4 గంటల 55 నిమిషాల ఆలస్యంతో మంగళవారం మధ్యాహ్నం 12.40 గంటలకు అబుదాబికి విమానం చేరుకుందని, వాస్తవానికి ఈవై395 విమానం మంగళవారం ఉదయం 7.45 గంటలకు అబుదాబి రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే స్థానిక ఫోన్ నంబర్లు, లైవ్ చాట్ మరియు సోషల్ మీడియా ద్వారా తమను సంప్రదించాలని ఎతిహాద్ ఎయిర్వేస్ ప్రయాణికులకు సూచించింది.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









