టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చిన ఎతిహాద్ విమానం..!
- September 03, 2024
యూఏఈ: అబుదాబి బయలుదేరిన ఎతిహాద్ విమానం పక్షులను ఢీకొట్టిన అనంతరం కొలంబోకు తిరిగి వచ్చింది. సెప్టెంబర్ 3న కొలంబో బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం (CMB) నుండి అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH)కి వెళ్లాల్సిన EY395 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చిందని అధికారులు తెలిపారు. జరిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. పక్షులను ఢీకొట్టడం ప్రమాదకరమని, తనిఖీల తర్వాత తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తామని విమానయాన సంస్థ తెలిపింది.తనిఖీల అనంతరం ఎతిహాద్ విమానం కొలంబో నుండి బయలుదేరిందని వెల్లడించారు. 4 గంటల 55 నిమిషాల ఆలస్యంతో మంగళవారం మధ్యాహ్నం 12.40 గంటలకు అబుదాబికి విమానం చేరుకుందని, వాస్తవానికి ఈవై395 విమానం మంగళవారం ఉదయం 7.45 గంటలకు అబుదాబి రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే స్థానిక ఫోన్ నంబర్లు, లైవ్ చాట్ మరియు సోషల్ మీడియా ద్వారా తమను సంప్రదించాలని ఎతిహాద్ ఎయిర్వేస్ ప్రయాణికులకు సూచించింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







