టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చిన ఎతిహాద్ విమానం..!
- September 03, 2024
యూఏఈ: అబుదాబి బయలుదేరిన ఎతిహాద్ విమానం పక్షులను ఢీకొట్టిన అనంతరం కొలంబోకు తిరిగి వచ్చింది. సెప్టెంబర్ 3న కొలంబో బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం (CMB) నుండి అబుదాబి జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయం (AUH)కి వెళ్లాల్సిన EY395 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి వచ్చిందని అధికారులు తెలిపారు. జరిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. పక్షులను ఢీకొట్టడం ప్రమాదకరమని, తనిఖీల తర్వాత తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తామని విమానయాన సంస్థ తెలిపింది.తనిఖీల అనంతరం ఎతిహాద్ విమానం కొలంబో నుండి బయలుదేరిందని వెల్లడించారు. 4 గంటల 55 నిమిషాల ఆలస్యంతో మంగళవారం మధ్యాహ్నం 12.40 గంటలకు అబుదాబికి విమానం చేరుకుందని, వాస్తవానికి ఈవై395 విమానం మంగళవారం ఉదయం 7.45 గంటలకు అబుదాబి రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలుంటే స్థానిక ఫోన్ నంబర్లు, లైవ్ చాట్ మరియు సోషల్ మీడియా ద్వారా తమను సంప్రదించాలని ఎతిహాద్ ఎయిర్వేస్ ప్రయాణికులకు సూచించింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







