57 మంది బంగ్లాదేశీయులకు ఊరట.. శిక్షలు ఎత్తివేత.. యూఏఈ అధ్యక్షుడు ఆదేశాలు..!
- September 03, 2024
యూఏఈ: ఎమిరేట్స్లో గత నెలలో నిరసనలలో పాల్గొన్న బంగ్లాదేశ్ పౌరులకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ క్షమాపణ ప్రసాదించారు. దోషులపై శిక్షలను ఎత్తివేయాలని వారిని దేశం నుండి బహిష్కరించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రెసిడెంట్ ఆదేశాలతో యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ అల్ షమ్సీ.. శిక్షల అమలును నిలిపివేయాలని, బహిష్కరణ ప్రక్రియలను ప్రారంభించాలని ఉత్తర్వు జారీ చేశారు.
అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూఏఈలో ఉన్న బంగ్లా దేశీయులు నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనలకు పిలుపునిచ్చినందుకు అల్లర్లను ప్రేరేపించినందుకు అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ జూలై 22న ముగ్గురు బంగ్లాదేశీయులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి సమావేశంలో పాల్గొన్నందుకు మరో 53 మందికి 10 ఏళ్ల శిక్ష, ఒక నిందితుడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







