57 మంది బంగ్లాదేశీయులకు ఊరట.. శిక్షలు ఎత్తివేత.. యూఏఈ అధ్యక్షుడు ఆదేశాలు..!
- September 03, 2024
యూఏఈ: ఎమిరేట్స్లో గత నెలలో నిరసనలలో పాల్గొన్న బంగ్లాదేశ్ పౌరులకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ క్షమాపణ ప్రసాదించారు. దోషులపై శిక్షలను ఎత్తివేయాలని వారిని దేశం నుండి బహిష్కరించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రెసిడెంట్ ఆదేశాలతో యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ అల్ షమ్సీ.. శిక్షల అమలును నిలిపివేయాలని, బహిష్కరణ ప్రక్రియలను ప్రారంభించాలని ఉత్తర్వు జారీ చేశారు.
అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూఏఈలో ఉన్న బంగ్లా దేశీయులు నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరసనలకు పిలుపునిచ్చినందుకు అల్లర్లను ప్రేరేపించినందుకు అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ జూలై 22న ముగ్గురు బంగ్లాదేశీయులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి సమావేశంలో పాల్గొన్నందుకు మరో 53 మందికి 10 ఏళ్ల శిక్ష, ఒక నిందితుడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







