వీసా క్షమాభిక్ష.. దరఖాస్తుదారులకు టైపింగ్ కేంద్రాల కీలక సూచనలు..!
- September 03, 2024
యూఏఈ: వీసా క్షమాభిక్ష కోరుకునేవారు అవసరమైన అన్ని పత్రాలను వెంట తీసుకురావాలని టైపింగ్ కేంద్రాలు సూచించాయి. చాలా మంది దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి అసంపూర్తిగా ఉన్న పేపర్లతో వస్తున్నారని టైపింగ్ సెంటర్ ఏజెంట్లు తెలిపారు. అల్ రహ్మానియా ప్రాంతంలోని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ సమీపంలో ఉన్న కొన్ని టైపింగ్ సెంటర్ల వద్ద దరఖాస్తుదారులతో భారీ రద్దీ నెలకొంది. “ చాలా మంది క్షమాభిక్ష దరఖాస్తుదారులు అవుట్పాస్ కోసం వారి స్థితిని చట్టబద్ధం చేసుకోవడానికి వస్తున్నారు. కానీ చాలా మంది అసంపూర్ణ పత్రాలతో వస్తున్నారు. తమ హోదాను క్రమబద్ధీకరించుకుని, దేశంలోనే ఉండాలనుకునే వారు తమకు ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ నుంచి వీసాలు తీసుకురావాలి.” అని అల్ రహ్మానియాలోని ఒక టైపిస్ట్ కేంద్రం ఏజెంట్ చెప్పారు. మరోవైపు ఎక్కువ మంది దరఖాస్తుదారులను ఆకర్షించడానికి కొన్ని టైపింగ్ కేంద్రాలు ఫీజులను తగ్గించాయి. కేవలం అవుట్పాస్ కోరుకునే దరఖాస్తుదారులు పాస్పోర్ట్, ఫోటో, వారి గడువు ముగిసిన వీసా కాపీని తీసుకురావాలని సూచించారు.
అయితే, ఒక కంపెనీ ద్వారా ఉద్యోగం ఆఫర్ చేయబడిన, కానీ పరారీలో ఉన్నట్లు ప్రకటించబడిన వారి వీసాలు రద్దు చేయలేదు. ముందుగా వారి వీసాను రద్దు చేసి, లేబర్ నుండి కొత్త ఆఫర్ మరియు ఆమోదం తీసుకోవాలని, వారు అవుట్పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దేశం నుండి నిష్క్రమించకుండానే స్థితిని మార్చవచ్చన్నారు. వారు కొత్త ఉపాధి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికన్, మధ్యప్రాచ్య దేశాల నుండి పెద్ద సంఖ్యలో క్షమాభిక్ష కోరేవారు తమ స్థితిని క్రమబద్ధీకరించుకోవడానికి టైపింగ్ కేంద్రాల వెలుపల క్యూ కడుతున్నారు. కొందరు తమకు తాముగా అవుట్పాస్ పొందడానికి రాగా, మరికొందరికి కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చాయని, వారి స్థితిని చట్టబద్ధం చేయాలని వస్తున్నట్లు ఏజెంట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







