భూమి వాతావరణంలో పూర్తిగా మండిపోయిన గ్రహశకలం..!
- September 06, 2024
మస్కట్: ఇటీవల గుర్తించిన గ్రహశకలం 2024 ఆర్డబ్ల్యూ1 భూమి వాతావరణం గుండా వెళుతుండగా పూర్తిగా మండిపోయిందని ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ధృవీకరించింది. గ్రహశకలం చిన్నదని, భూమి ఉపరితలంపై ఎటువంటి ప్రమాదం లేదని ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ డాక్టర్ ఇషాక్ బిన్ యాహ్యా అల్-షుయైలీ తెలిపారు. ఈ గ్రహశకలం భూమికి చేరుకోవడానికి కొన్ని గంటల ముందు అరిజోనా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కాటాలినా స్కై సర్వే ప్రాజెక్ట్ ద్వారా గుర్తించినట్లు వివరించారు. సెకనుకు 17 కిలోమీటర్ల వేగంతో గురువారం తెల్లవారుజామున ఫిలిప్పీన్స్కు ఉత్తరాన ఉన్న లుజోన్ ద్వీపం సమీపంలో భూమిని ఢీకొనే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రహశకలం పరిమాణం దాదాపు 1.5 మీటర్లు ఉంటుందని, ఇది చాలా చిన్నదని, దీని వల్ల భూమికి పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయని, ఆందోళన అవసరం లేదని ఆయన సూచించారు. వందల మీటర్ల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన పెద్ద వస్తువులతో ప్రమాదం ఉంటుందని అల్-షైలీ చెప్పారు. 2022లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ప్రయోగించిన ‘డార్ట్’ అంతరిక్ష నౌకను ఢీకొని చిన్న చంద్రుడిగా భావిస్తున్న ‘డైమోర్ఫోస్’ మార్గాన్ని మార్చి శాస్త్రవేత్తలు సాధించిన విజయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ విజయం భూమికి ప్రమాదం కలిగించే పెద్ద వస్తువులను ఎదుర్కోనే సామర్థ్యాన్ని నిరూపించిందన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..