అక్టోబర్లో రియాద్లో మరో అంతర్జాతీయ కాన్ఫరేన్స్..!
- September 10, 2024
రియాద్: ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ (FII) 8వ ఎడిషన్ రియాద్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో అక్టోబర్ 29 - 31తేదీలలో జరుగనుంది. ఈ ఈవెంట్ "ఇన్ఫినిట్ హారిజన్స్: ఇన్వెస్టింగ్ టుడే, షేపింగ్ టుమారో" అనే థీమ్తో నిర్వహించనున్నారు. ఈ ప్రితిష్టాత్మక కాన్ఫరెన్స్ ను రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ప్రారంభించనున్నారు. దాదాపు 6వేల మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నట్టు FII ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బోర్డు సభ్యుడు రిచర్డ్ అటియాస్ వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లతోసహా ఆర్థిక పురోగతి సంబంధిత అంశాలపై వివిధ దేశాల ఆర్థిక రంగ నిపుణులు తమ ఆలోచనలను పంచుకుంటారని తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









