కువైట్ లో ఇంజినీరింగ్ సర్టిఫికేట్ల ధృవీకరణపై వివాదం..!
- September 10, 2024
కువైట్: కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్(KSE) తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ తాత్కాలికంగా రద్దుచేసింది. అక్రిడిటేషన్ విధానాలకు సంబంధించి కంపెనీలు, వ్యాపార యజమానులు, ఉద్యోగుల నుండి మ్యాన్పవర్ అథారిటీకి అనేక ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 2018లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఇంజనీరింగ్ సర్టిఫికేట్లను ఆమోదించడానికి, ప్రవాస కార్మికులకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని ధృవీకరించడానికి, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాలలో ఉపాధిని కోరుకునే వ్యక్తులకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ లను ధృవీకరించడానికి KSEకి అధికారం కల్పించారు. అయితే, ఇకపై సర్టిఫికేట్ వేరిఫికేషన్ కోసం కొత్త విధానాలను ప్రకటించలేదు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!