సింగపూర్ లో వైభవంగా వినాయకచవితి వేడుకలు
- September 11, 2024
సింగపూర్: ప్రపంచవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో భాద్రపద శుక్ల చవితిని పురస్కరించుకుని జరుపుకునే వినాయక చవితి పండుగను ఈ ఏడాది కూడా సింగపూర్లోని తెలుగు వారు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో కిండల్ కిడ్స్ పాఠశాల సభామందిరంలో సశాస్త్రీయంగా కల్పోక్తరీతిలో ఘనంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమైన ఈ పూజ కార్యక్రమంలో వినాయక షోడషోపచార, ఏకవింశతి, దూర్వాయుగ్మ, అష్టోత్తర శతనామావళి పూజలతో పాటు , వినాయకోత్పత్తి, శమంతకమణోపాఖ్యానం వంటి కథా శ్రవణాలతో కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. సుస్మిత కొల్లి అందర్నీ ఆకట్టుకునేలా పూజా వేదికను అలంకరణ చేశారు. విద్యార్థి బృందం దేవుని పాటలతో అందరినీ అలరించింది. పూజ అనంతరం అందరికీ ప్రసాద వితరణ జరిగింది. గణపతి లడ్డూ వేలంలో లక్ష్మి మరియు కరణ్ దంపతులు లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమం చివరగా నిమజ్జనంతో ముగిసింది.
కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి సుప్రియ మాట్లాడుతూ, పూజలో పాల్గొన్న పిల్లలు, ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు మరియు పెద్దలు ప్రత్యక్షంగా పాల్గొని భక్తి మరియు శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాకుండా ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా 7,500 మందికి పైగా వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.
తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం దైవసంకల్పం అని, ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రకృతి విపత్తుల నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రధానంగా సహకరించిన కిండల్ కిడ్స్ పాఠశాల యాజమాన్యానికి, విగ్రహ దాతలు పుట్టి ప్రసాద్, ముద్దం విజ్జేందర్, తాటిపల్లి విజయబాబు, కొత్తమాసు రాజశేఖర్ కు, పూజారి శ్రవణ్ బల్కి కి, ప్రసాదాలు అందించడానికి సహకరించిన దాతలకు, కమిటీ సభ్యులకు,సేవాదళ కార్యకర్తలకు గౌరవ కార్యదర్శి అనిల్ కుమారి పోలిశెట్టి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..