కువైట్ ఎయిర్పోర్ట్.. ‘స్మార్ట్’గా T2 టెర్మినల్..గడువులోగా పూర్తి..!!
- September 12, 2024
కువైట్: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ T2 ప్యాసింజర్స్ టెర్మినల్ అత్యాధునిక "స్మార్ట్"గా రూపొందనుంది. ప్రస్తుతం జరుగుతున్న మెగా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్లలో ఒకటిగా దీనిని పరిగణిస్తున్నట్టు ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా తెలిపారు. కొత్త ప్రాజెక్ట్ ఆవరణలో జరిగిన క్యాబినెట్ వీక్లీ సమావేశంలో ప్రాజెక్ట అమలుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం టెర్మినల్ సైట్ను పరిశీలించారు. ప్రాజెక్ట్ అమలును స్వయంగా పరిశీలించి, ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖతో సహకరించాలని సంబంధిత ప్రభుత్వ సంస్థలను ఆదేశించింది. T2 అనేది ఆధునిక మరియు అత్యాధునిక "స్మార్ట్" ప్రాజెక్ట్గా పరిగణిస్తున్నట్టు తెలిపారు. కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చీఫ్ షేక్ హుమూద్ ముబారక్ అల్-హుమూద్ అల్-జాబర్ అల్-సబా ప్రాజెక్ట్ పురోగతిని తెలిపే ప్రదర్శనను ప్రారంభించారు. ఈ కీలకమైన ప్రాజెక్ట్ని నిర్ణీత గడువులోపు పూర్తి చేయడానికి కృషి చేస్తున్న సంబంధిత ప్రభుత్వ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







