ధరల్లో తేడా..6 జిప్సం కంపెనీలకు SR 91 మిలియన్ జరిమానాలు..!!
- September 12, 2024
రియాద్: ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆరు జిప్సం కంపెనీలకు సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ భారీ జరిమానాలను విధించింది. కాంపిటీటివ్ చట్టాన్ని ఉల్లంఘించి ధరలను నిర్ణయించారని పేర్కొంటూ ఈ కంపెనీలపై మొత్తం SR91.1 మిలియన్ జరిమానాలు విధించినట్టు అథారిటీ వెల్లడించింది. వీటిలో రెండు కంపెనీలు సౌదీ తడావుల్ స్టాక్ మార్కెట్, నోము సమాంతర స్టాక్ మార్కెట్లో లీస్ట్ అయ్యాయి. కంపెనీలు తమ స్వంత ఖర్చులతో స్థానిక మీడియాలో ఈ విషయాన్నిప్రచురించాలని ఆదేశించింది.
ఈ కంపెనీలపై విధించిన జరిమానా మొత్తం ఈ విధంగా ఉంది: SR10.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ; SR14.4 మిలియన్ — యునైటెడ్ మైనింగ్ ఇండస్ట్రీస్ కంపెనీ; SR23.4 మిలియన్ — అల్-ఖాయత్ జిప్సం కంపెనీ; SR19.9 మిలియన్ — మడా జిప్సమ్ లిమిటెడ్; SR 19 మిలియన్ — ASK జిప్సం ఫ్యాక్టరీ లిమిటెడ్; SR 3.7 మిలియన్ — నేషనల్ జిప్సం కంపెనీ.
తాజా వార్తలు
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై







