నామా డిజిటల్ క్యాంపెయిన్.. 4లక్షల నీటి మీటర్లతో ఆటో రీడింగ్..!
- September 12, 2024
సోహర్: నార్త్ అల్ బతినా గవర్నరేట్లో వాటర్ మీటర్ల కోసం డిజిటల్ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్ రెండవ దశను నామా వాటర్ సర్వీసెస్ కంపెనీ ప్రారంభించింది. ఇందులో భాగంగా గవర్నరేట్ విలాయత్లలో 115,000 మీటర్లను అమర్చనున్నారు. ఈ మేరకు ఉత్తర అల్ బతినా గవర్నర్ మహ్మద్ సులైమాన్ అల్ కిండీ ఆధ్వర్యంలో నామా వాటర్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
గవర్నరేట్లో తమ సేవలను బలోపేతం చేయడానికి కంపెనీ ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్ట్ 400,000 మీటర్లను ఇన్స్టాలేషన్ చేయనున్నట్లు తెలిపింది. సబ్స్క్రైబర్ రెండు రకాల డిజిటల్ మీటర్లు, ప్రీపెయిడ్ (బ్యాలెన్స్ రీఛార్జ్ సిస్టమ్ ద్వారా) లేదా పోస్ట్పెయిడ్ (బిల్లింగ్ సిస్టమ్ ద్వారా) ఫీజులు చెల్లించకుండా ఉచితంగా ఎంచుకోవచ్చు. మీటర్లను రిమోట్గా నమోదు చేయడం వలన కంపెనీ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ జారీని సులభతరం చేస్తుందని, ఇది వాస్తవ వినియోగాన్ని ప్రతిబింబించే నిజమైన (అంచనా వేయని) రీడింగ్లపై ఆధారపడటం ద్వారా బిల్లింగ్ ప్రక్రియను మెరుగుపరుస్తుందన్నారు. "నమా వాటర్ సర్వీసెస్" వెబ్సైట్లోని ఎలక్ట్రానిక్ సేవల పోర్టల్లో నీటి వినియోగ బిల్లును ఆటోమెటిక్ గా రికార్డు కానుంది. చందాదారులు తమ డేటాను కంపెనీ ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









