చిరంజీవి కమర్షియల్ యాడ్పై ఎందుకింత రచ్చ.?
- September 12, 2024
చిరంజీవికి కమర్షియల్ యాడ్స్ చేయడం కొత్తేం కాదు. గతంలోనూ చాలా సార్లు చాలా కమర్షియల్ యాడ్స్లో చిరంజీవి నటించారు. అలా వచ్చిన సొమ్మును చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేస్తుంటారు. చాలా కాలం తర్వాత ఈ మధ్యనే చిరంజీవి ఓ కమర్షియల్ యాడ్లో నటించారు.
కంట్రీ డిలైట్ పాలకు చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఓ కమర్షియల్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్కి హరీష్ శంకర్ డైరెక్టర్గా వ్యవహరించారు.
అయితే, ఈ యాడ్ విషయంలో ఓ రచ్చ జరుగుతోంది. ఓ సామాజిక వర్గం కంట్రీ డిలైట్ పాలపై నిషేధం విధించినట్లు ఓ మీడియా వర్గం ప్రచారం చేస్తోంది.
గతంలోనూ చిరంజీవి చేసిన కమర్షియల్ యాడ్స్ విషయంలో ఇలాంటి వివాదాలే చెలరేగాయ్. అప్పట్లో ఓ కూల్ డ్రింక్ యాడ్లో చిరంజీవి నటించడం వల్ల.. ఓ సామాజిక వర్గం ఆ కూల్డ్రింక్ని బ్యాన్ చేసిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
అలాంటిదే ఇప్పుడు ఈ కంట్రీ డిలైట్ పాల యాడ్ విషయంలో మళ్లీ రేగింది. అయితే, ఇదంతా ఓ వర్గం మీడియా కావాలని చేసే దుష్ప్రచారమే కానీ, నిజంగా బ్యాన్ చేయడాల్లాంటివేమీ వుండవని కొందరు ఇస్తున్న వివరణ.
ఇకపోతే, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ కమర్షియల్ యాడ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. బోలెడన్ని వ్యూస్ వస్తున్నాయ్. అలాగే, పాలకు సంబంధించిన యాడ్ కావడంతో.. అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు.
చిరంజీవి ఆ యాడ్లో నటించారంటే ఖచ్చితంగా వాటిపై పాజిటివ్ ఒపీనియన్ వుంటుంది. ఈ పాలు ఏ షాప్లో దొరుకుతాయ్.. అని చిరంజీవి ఆత్మారామ్ అడగ్గా.. షాప్లో కాదు, యాప్లో అంటూ చిరంజీవి చెప్పే సమాధానం బాగుంటుంది. అన్నట్లు ఆ యాప్ని ఇప్పటికే చాలా మంది డౌన్ లోడ్ చేసేసుకున్నారు కూడా.
✨ Collaboration of the Year! ✨
— Country Delight (@_countrydelight) September 9, 2024
This Ganesh Chaturthi, we’re proud to welcome Megastar Chiranjeevi as our official brand ambassador! 🎉 @KChiruTweets#ChiranjeeviXCountryDelight #ChiranjeeviTrustsCountryDelight pic.twitter.com/DdsY3zFRKl
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







