చిరంజీవి కమర్షియల్ యాడ్పై ఎందుకింత రచ్చ.?
- September 12, 2024
చిరంజీవికి కమర్షియల్ యాడ్స్ చేయడం కొత్తేం కాదు. గతంలోనూ చాలా సార్లు చాలా కమర్షియల్ యాడ్స్లో చిరంజీవి నటించారు. అలా వచ్చిన సొమ్మును చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చేస్తుంటారు. చాలా కాలం తర్వాత ఈ మధ్యనే చిరంజీవి ఓ కమర్షియల్ యాడ్లో నటించారు.
కంట్రీ డిలైట్ పాలకు చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఓ కమర్షియల్ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాడ్కి హరీష్ శంకర్ డైరెక్టర్గా వ్యవహరించారు.
అయితే, ఈ యాడ్ విషయంలో ఓ రచ్చ జరుగుతోంది. ఓ సామాజిక వర్గం కంట్రీ డిలైట్ పాలపై నిషేధం విధించినట్లు ఓ మీడియా వర్గం ప్రచారం చేస్తోంది.
గతంలోనూ చిరంజీవి చేసిన కమర్షియల్ యాడ్స్ విషయంలో ఇలాంటి వివాదాలే చెలరేగాయ్. అప్పట్లో ఓ కూల్ డ్రింక్ యాడ్లో చిరంజీవి నటించడం వల్ల.. ఓ సామాజిక వర్గం ఆ కూల్డ్రింక్ని బ్యాన్ చేసిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
అలాంటిదే ఇప్పుడు ఈ కంట్రీ డిలైట్ పాల యాడ్ విషయంలో మళ్లీ రేగింది. అయితే, ఇదంతా ఓ వర్గం మీడియా కావాలని చేసే దుష్ప్రచారమే కానీ, నిజంగా బ్యాన్ చేయడాల్లాంటివేమీ వుండవని కొందరు ఇస్తున్న వివరణ.
ఇకపోతే, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ కమర్షియల్ యాడ్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. బోలెడన్ని వ్యూస్ వస్తున్నాయ్. అలాగే, పాలకు సంబంధించిన యాడ్ కావడంతో.. అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు.
చిరంజీవి ఆ యాడ్లో నటించారంటే ఖచ్చితంగా వాటిపై పాజిటివ్ ఒపీనియన్ వుంటుంది. ఈ పాలు ఏ షాప్లో దొరుకుతాయ్.. అని చిరంజీవి ఆత్మారామ్ అడగ్గా.. షాప్లో కాదు, యాప్లో అంటూ చిరంజీవి చెప్పే సమాధానం బాగుంటుంది. అన్నట్లు ఆ యాప్ని ఇప్పటికే చాలా మంది డౌన్ లోడ్ చేసేసుకున్నారు కూడా.
✨ Collaboration of the Year! ✨
— Country Delight (@_countrydelight) September 9, 2024
This Ganesh Chaturthi, we’re proud to welcome Megastar Chiranjeevi as our official brand ambassador! 🎉 @KChiruTweets#ChiranjeeviXCountryDelight #ChiranjeeviTrustsCountryDelight pic.twitter.com/DdsY3zFRKl
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









