ఆసియా మహిళ అక్రమ రవాణా..ఇద్దరు నిందితులపై విచారణ..!
- September 13, 2024
మనామా: మానవ అక్రమ రవాణా ఆరోపణలపై విచారణకు ఇద్దరు అనుమానితులను రిఫెరల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. అనుమానితులు ఒక ఆసియా మహిళను బందీగా ఉంచి, అనైతిక చర్యలకు ఉపయోగించుకున్నారని కేసులు నమోదు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 22 నమోదైనట్టు వెల్లడించింది. కేసుకు సంబంధించి పోలీసు నివేదికను స్వీకరించిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన దర్యాప్తును ప్రారంభించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది. అనుమానితులు ఒక క్రిమినల్ గ్రూపుగా ఏర్పడి ఉపాధి హామీతో బాధితురాలిని బహ్రెయిన్కు రప్పించారని తెలిపింది. బెదిరింపుల ద్వారా ఆమెను వ్యభిచారంలోకి నెట్టారని ఆరోపించారు. బాధితురాలు తన రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా వారు పోలీసులను అప్రమత్తం చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒకే ఫోన్ కాల్తో BD1,030 కోల్పోయిన మహిళ..!!
- వెబ్సైట్ల విశ్వసనీయత పై SDAIA కీలక సూచనలు..!!
- దుబాయ్-షార్జా-అజ్మాన్ మధ్య కొత్త ట్రాన్స్ పోర్ట్ ప్రణాళిక..!!
- హోర్ముజ్ రాకపోకల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కొత్తగా ఐదు ఐపీ ఇ-సేవలను ప్రారంభించిన ఖతార్..!!
- కువైట్ లో వాటిని వీడియో తీసిన 29 మంది అరెస్టు..!!
- బాసర ఆలయాభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ |
- ఖతార్ ప్రధానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్
- ఏప్రిల్ 10 నుంచి యూపీఐ తప్పనిసరి
- తారామతి బారాదరిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్’ పార్టీ పై ఈగల్ పోలీసుల దాడులు









