ఆసియా మహిళ అక్రమ రవాణా..ఇద్దరు నిందితులపై విచారణ..!
- September 13, 2024
మనామా: మానవ అక్రమ రవాణా ఆరోపణలపై విచారణకు ఇద్దరు అనుమానితులను రిఫెరల్ చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. అనుమానితులు ఒక ఆసియా మహిళను బందీగా ఉంచి, అనైతిక చర్యలకు ఉపయోగించుకున్నారని కేసులు నమోదు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 22 నమోదైనట్టు వెల్లడించింది. కేసుకు సంబంధించి పోలీసు నివేదికను స్వీకరించిన వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన దర్యాప్తును ప్రారంభించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది. అనుమానితులు ఒక క్రిమినల్ గ్రూపుగా ఏర్పడి ఉపాధి హామీతో బాధితురాలిని బహ్రెయిన్కు రప్పించారని తెలిపింది. బెదిరింపుల ద్వారా ఆమెను వ్యభిచారంలోకి నెట్టారని ఆరోపించారు. బాధితురాలు తన రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా వారు పోలీసులను అప్రమత్తం చేయడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







