వీసా నియంత్రణలను కఠినతరం చేసిన బహ్రెయిన్..!!
- September 15, 2024
మనామా: పర్యాటక వీసాలు, వర్క్ పర్మిట్లతో సహా అన్ని వీసాలు, రెసిడెన్సీ పర్మిట్లపై నియంత్రణలను కఠినతరం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీసాలను పొందడం లేదా మార్చడం, వ్యాపార సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిరోధించడమే లక్ష్యంగా కఠినమైన నిబంధనలను రూపొందించనున్నట్లు తెలిపింది. "బహ్రెయిన్ ఎంట్రీ వీసా నిర్ణయంలోని ఆర్టికల్ 4 ప్రకారం, సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చకూడదన్న కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఇది అవసరమైతే వీసా జారీ చేయడానికి ముందు ఇమ్మిగ్రేషన్ అధికారులు బహ్రెయిన్ గ్యారంటర్ను కోరడానికి అనుమతిస్తుంది. " తెలిపింది. 250 బహ్రెయిన్ దినార్ల రుసుముతో సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా లేదా కుటుంబ పునరేకీకరణ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని అనుమతించేటప్పుడు, గ్యారంటర్ లేకుండా సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిరోధించడం ఈ నిర్ణయం లక్ష్యం అని పేర్కొన్నారు. విజిటింగ్ ప్రయోజనాల కోసం మంజూరు చేసిన బహ్రెయిన్కు ప్రవేశ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిషేధించే ముసాయిదా చట్టాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వం పార్లమెంటును కోరిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









