వీసా నియంత్రణలను కఠినతరం చేసిన బహ్రెయిన్..!!
- September 15, 2024
మనామా: పర్యాటక వీసాలు, వర్క్ పర్మిట్లతో సహా అన్ని వీసాలు, రెసిడెన్సీ పర్మిట్లపై నియంత్రణలను కఠినతరం చేయనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీసాలను పొందడం లేదా మార్చడం, వ్యాపార సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిరోధించడమే లక్ష్యంగా కఠినమైన నిబంధనలను రూపొందించనున్నట్లు తెలిపింది. "బహ్రెయిన్ ఎంట్రీ వీసా నిర్ణయంలోని ఆర్టికల్ 4 ప్రకారం, సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చకూడదన్న కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఇది అవసరమైతే వీసా జారీ చేయడానికి ముందు ఇమ్మిగ్రేషన్ అధికారులు బహ్రెయిన్ గ్యారంటర్ను కోరడానికి అనుమతిస్తుంది. " తెలిపింది. 250 బహ్రెయిన్ దినార్ల రుసుముతో సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా లేదా కుటుంబ పునరేకీకరణ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని అనుమతించేటప్పుడు, గ్యారంటర్ లేకుండా సందర్శకుల వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిరోధించడం ఈ నిర్ణయం లక్ష్యం అని పేర్కొన్నారు. విజిటింగ్ ప్రయోజనాల కోసం మంజూరు చేసిన బహ్రెయిన్కు ప్రవేశ వీసాలను వర్క్ పర్మిట్లుగా మార్చడాన్ని నిషేధించే ముసాయిదా చట్టాన్ని పునఃపరిశీలించాలని ప్రభుత్వం పార్లమెంటును కోరిందని వెల్లడించారు.
తాజా వార్తలు
- దమ్మామ్ విమానాశ్రయంలో భారీ గా డ్రగ్స్ సీజ్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదం.. కార్మికుడికి గాయాలు..!!
- ఇరాన్ వాదనలను ఖండించిన ఖతార్.. యూఎన్ఓకు లేఖలు..!!
- రోడ్డు ప్రమాదంలో స్టూడెంట్ మృతి.. విద్యాశాఖ దిగ్భ్రాంతి..!!
- ఒమన్లో గుండె మార్పిడి సక్సెస్.. ఒకే దాతతో నలుగురికి ప్రాణదానం..!!
- 2 కిలోమీటర్లకు 40 నిమిషాలు.. యూఏఈలో మళ్లీ భారీ ట్రాఫిక్..!!
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు







