పాలస్తీనా సంక్షోభం..అంతర్జాతీయ సమాజానికి ఖతార్ పిలుపు..!
- September 18, 2024
జెనీవా: పాలస్తీనా ప్రజలకు ఖతార్ తన మద్దతును తెలియజేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి, పాలస్తీనా లో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖతార్ పిలుపునిచ్చింది.
యునైటెడ్ నేషన్స్ 71వ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్లో సమావేశం సందర్భంగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోని ఖతార్ శాశ్వత ప్రతినిధి డాక్టర్ హింద్ అబ్దుల్రహ్మాన్ అల్ ముఫ్తా ఈ మేరకు కోరింది. అదే సమయంలో పాలస్తీనా ఆర్థిక వ్యవస్థపై ఇజ్రాయెల్ ఆక్రమణ ప్రభావాన్ని తగ్గించడంలో UNCTAD పోషించిన కీలక పాత్రను ప్రశంసించారు. పాలస్తీనా ప్రజలకు మానవతావాద, అభివృద్ధికి మద్దతును కొనసాగిస్తానని ఖతార్ స్పష్టం చేసింది. గాజాలోని ప్రజలకుకు ఆహారం, అత్యవసర ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయాన్ని అందించడానికి ఖతార్ ఛారిటీ నియర్ ఈస్ట్లోని పాలస్తీనా శరణార్థుల కోసం UN రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)తో ఆగస్టులో $3 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసిందని హర్ ఎక్సలెన్సీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









