పాలస్తీనా సంక్షోభం..అంతర్జాతీయ సమాజానికి ఖతార్ పిలుపు..!
- September 18, 2024
జెనీవా: పాలస్తీనా ప్రజలకు ఖతార్ తన మద్దతును తెలియజేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి, పాలస్తీనా లో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖతార్ పిలుపునిచ్చింది.
యునైటెడ్ నేషన్స్ 71వ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్లో సమావేశం సందర్భంగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోని ఖతార్ శాశ్వత ప్రతినిధి డాక్టర్ హింద్ అబ్దుల్రహ్మాన్ అల్ ముఫ్తా ఈ మేరకు కోరింది. అదే సమయంలో పాలస్తీనా ఆర్థిక వ్యవస్థపై ఇజ్రాయెల్ ఆక్రమణ ప్రభావాన్ని తగ్గించడంలో UNCTAD పోషించిన కీలక పాత్రను ప్రశంసించారు. పాలస్తీనా ప్రజలకు మానవతావాద, అభివృద్ధికి మద్దతును కొనసాగిస్తానని ఖతార్ స్పష్టం చేసింది. గాజాలోని ప్రజలకుకు ఆహారం, అత్యవసర ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయాన్ని అందించడానికి ఖతార్ ఛారిటీ నియర్ ఈస్ట్లోని పాలస్తీనా శరణార్థుల కోసం UN రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)తో ఆగస్టులో $3 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసిందని హర్ ఎక్సలెన్సీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







