పాలస్తీనా సంక్షోభం..అంతర్జాతీయ సమాజానికి ఖతార్ పిలుపు..!
- September 18, 2024
జెనీవా: పాలస్తీనా ప్రజలకు ఖతార్ తన మద్దతును తెలియజేసింది. ఇజ్రాయెల్ దురాక్రమణను ఆపడానికి, పాలస్తీనా లో మానవతా సంక్షోభాన్ని పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖతార్ పిలుపునిచ్చింది.
యునైటెడ్ నేషన్స్ 71వ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్లో సమావేశం సందర్భంగా జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలోని ఖతార్ శాశ్వత ప్రతినిధి డాక్టర్ హింద్ అబ్దుల్రహ్మాన్ అల్ ముఫ్తా ఈ మేరకు కోరింది. అదే సమయంలో పాలస్తీనా ఆర్థిక వ్యవస్థపై ఇజ్రాయెల్ ఆక్రమణ ప్రభావాన్ని తగ్గించడంలో UNCTAD పోషించిన కీలక పాత్రను ప్రశంసించారు. పాలస్తీనా ప్రజలకు మానవతావాద, అభివృద్ధికి మద్దతును కొనసాగిస్తానని ఖతార్ స్పష్టం చేసింది. గాజాలోని ప్రజలకుకు ఆహారం, అత్యవసర ఆశ్రయం వంటి ప్రాథమిక సహాయాన్ని అందించడానికి ఖతార్ ఛారిటీ నియర్ ఈస్ట్లోని పాలస్తీనా శరణార్థుల కోసం UN రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA)తో ఆగస్టులో $3 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసిందని హర్ ఎక్సలెన్సీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









