సెప్టెంబర్ 26న రియాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం..!!
- September 18, 2024
రియాద్: రియాద్లోని కింగ్ సౌద్ యూనివర్శిటీలో సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2024ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది 800 పెవిలియన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫెయిర్లో 30 కంటే ఎక్కువ దేశాల నుండి 2,000 కంటే ఎక్కువ స్థానిక, అరబ్ అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు, ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. అరబ్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ సాంస్కృతిక వేదికలలో ఒకటిగా రియాద్ బుక్ ఫెయిర్ స్థానం సంపాదించింది. ఖతార్ ఈ సంవత్సరం బుక్ ఫెయిర్లో గౌరవ అతిథిగా హోదాలో ఉంటుందని, ఐదు దశాబ్దాలుగా రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కొనసాగుతుందని కమిషన్ సీఈఓ డాక్టర్ ముహమ్మద్ అల్వాన్ తెలిపారు. బుక్ ఫెయిర్ తన సందర్శకులకు, సంస్కృతి పుస్తకాలను ఇష్టపడే వారికి, ఒక వినూత్నమైన సాంస్కృతిక ప్రయాణాన్ని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









