సెప్టెంబర్ 26న రియాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం..!!
- September 18, 2024
రియాద్: రియాద్లోని కింగ్ సౌద్ యూనివర్శిటీలో సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2024ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది 800 పెవిలియన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫెయిర్లో 30 కంటే ఎక్కువ దేశాల నుండి 2,000 కంటే ఎక్కువ స్థానిక, అరబ్ అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు, ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. అరబ్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ సాంస్కృతిక వేదికలలో ఒకటిగా రియాద్ బుక్ ఫెయిర్ స్థానం సంపాదించింది. ఖతార్ ఈ సంవత్సరం బుక్ ఫెయిర్లో గౌరవ అతిథిగా హోదాలో ఉంటుందని, ఐదు దశాబ్దాలుగా రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కొనసాగుతుందని కమిషన్ సీఈఓ డాక్టర్ ముహమ్మద్ అల్వాన్ తెలిపారు. బుక్ ఫెయిర్ తన సందర్శకులకు, సంస్కృతి పుస్తకాలను ఇష్టపడే వారికి, ఒక వినూత్నమైన సాంస్కృతిక ప్రయాణాన్ని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









