సెప్టెంబర్ 26న రియాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం..!!
- September 18, 2024
రియాద్: రియాద్లోని కింగ్ సౌద్ యూనివర్శిటీలో సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2024ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది 800 పెవిలియన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫెయిర్లో 30 కంటే ఎక్కువ దేశాల నుండి 2,000 కంటే ఎక్కువ స్థానిక, అరబ్ అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు, ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. అరబ్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ సాంస్కృతిక వేదికలలో ఒకటిగా రియాద్ బుక్ ఫెయిర్ స్థానం సంపాదించింది. ఖతార్ ఈ సంవత్సరం బుక్ ఫెయిర్లో గౌరవ అతిథిగా హోదాలో ఉంటుందని, ఐదు దశాబ్దాలుగా రియాద్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కొనసాగుతుందని కమిషన్ సీఈఓ డాక్టర్ ముహమ్మద్ అల్వాన్ తెలిపారు. బుక్ ఫెయిర్ తన సందర్శకులకు, సంస్కృతి పుస్తకాలను ఇష్టపడే వారికి, ఒక వినూత్నమైన సాంస్కృతిక ప్రయాణాన్ని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







